Breaking News

రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఈవిఎం వేర్ హౌస్ ను తనిఖీ చేసిన రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్

రేణిగుంట,  నేటి పత్రిక ప్రజావార్త :
రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఈవిఎం వేర్ హౌస్ ను రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌస్ నందు ఏర్పాటు చేసిన ఈవిఎం వేర్ హౌస్ ను ఆం.ప్ర సిఈఓ గారు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఈఓ గారు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ మరియు ఈవీఎం నోడల్ అధికారి కోదండ రామిరెడ్డి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈవిఎం వేర్ హౌస్ వద్ద 24X7 భద్రత ఏర్పాట్లు, సీసి కెమెరా పర్యవేక్షణ తదితర ఏర్పాట్ల పట్ల సిఈఓ గారు సంతృప్తి వ్యక్తం చేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *