Breaking News

ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి సర్వేను పరిశీలించిన నగర కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుగుతున్న ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి సర్వేను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం గవర్నర్పేటలో జరుగుతున్న సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం గవర్నర్పేటలో వార్డ్ అడ్మిన్ సెక్రటరీ, ఎమినిటీస్ సెక్రటరీ చేస్తున్న ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రతి అసెస్మెంట్ కి ఖచ్చితంగా ఈ సర్వేను నిర్వహించాలని, నిర్వహించిన సర్వే నివేదికను ఎటువంటి తప్పులు లేకుండా ఆన్లైన్లో జాగ్రత్తగా నమోదు చేయాలని అన్నారు.

ఇప్పటివరకు విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న 233121 అసెస్మెంట్ లకు గాను 220592 అసెస్మెంట్లకు ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి సర్వే నువ్వు పూర్తి చేశారని, దాదాపు 94% సర్వే పూర్తయిందని,ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి100% సర్వేను సత్వరమే పూర్తి చేసి నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సర్కిల్లో ప్రతి ఇంటికి కూడా ఈ సర్వే ను వేగవంతంగా నిర్వహించేటట్టు జోనల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ, ఇంజనీరింగ్, అధికారుల సహకారంతో సత్వరమే ప్రతి ఇంటి కి త్రాగునీటి కులాయి సర్వేను పూర్తి చేసి నివేదికన సమర్పించాలని కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతోపాటు డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాటర్ సప్లై రామ కృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బి. శ్రీనివాస్ రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజనీర్ నర్మదా, సచివాలయం సెక్రటరీలు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *