Breaking News

ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా అధికారులను ఆదేశించారు. కంచికచర్ల మండలం కీసర ఇసుక స్టాక్ పాయింట్ వద్ద శుక్రవారం జాయింట్ కలెక్టర్ నిధి మీనా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంపిణీ విధానాన్ని,స్టాక్ పాయింట్ వద్ద రిజిస్టర్ పరిశీలించారు. స్టాక్ పాయింట్ వద్ద బుకింగ్ అవకాశం ఉండకూడదన్నారు. నూతన పాలసీ అమలులోకి వచ్చే వరకు యెటువంటి విమర్శలకు, లోటుపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ నిధి మీనా అధికారుల ను ఆదేశించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *