Breaking News

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ఉదయం నుంచి నిరంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
• అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయక చర్యలపై సమీక్షిస్తున్న సిఎం.
• మరో సారి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సిఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డివోలు, డిఎస్పీలతో మాట్లాడి తాజా పరిస్థితిపై సమీక్షించిన సిఎం.
• సహాయ చర్యలకు జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున తక్షణం విడుదల చేయాలని సిఎం ఆదేశం
• భారీ వర్షాల కారణంగా 8 మంది చనిపోయినట్లు వివరించిన అధికారులు – బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి
• రేపు కూడా భారీ వర్షాలు ఉంటాయన్న సమాచారం నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ విభాగం పూర్తి అప్రమత్తతో ఉండాలన్న సిఎం
• శ్రీకాకుళం నుంచి విశాఖ మధ్య నేటి రాత్రి తుఫాను తీరం దాటుతుందని అంచనా
• ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్న సిఎం
• మూడు జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తతో ఉండాలని ఆదేశం.
• రాత్రి అంతా మెలుకువతో ఉండి అయినా సరే ప్రజల రక్షణ కోసం పని చేద్దామన్న సిఎం
• తుఫాను తీరం దాటే సమయంలో 55 నుంచి 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపిన అధికారులు
• తీరం దాటే సమయంలో గాలుల వేగంపై స్పష్టమైన అంచనాలతో సన్నద్ధంగా ఉండాలన్న సిఎం
• ఇప్పుడు తుఫాను ఎంత వేగంతో ప్రయాణిస్తుంది….ఎటువైపు వెళుతుంది అనే విషయాన్ని విశ్లేషించి అందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్న ముఖ్యమంత్రి
• నష్టం జరిగిన తరువాత స్పందించడం కాదు….నష్టం తగ్గించేలా అధికారుల పనితీరు ఉండాలన్న చంద్రబాబు
• హుద్ హుద్ తుఫాను సమయంలో అనుసరించిన బెస్ట్ ప్రాక్టీసెస్ ను నేడు పాటించాలని అధికారులకు సూచన

టెలీకాన్ఫరెన్స్ లో అధికారులు, ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు 
• వర్షాలు తగ్గేవరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.
• కొన్ని చోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం పడింది..రేపు కూడా వర్షాలు పడతాయని తెలుస్తోంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి.
• భారీ వర్షాలు ఉన్న జిల్లాల్లో సహాయక చర్యల కోసం జిల్లాకు రూ.3 కోట్లు….కాస్త తక్కువ ప్రభావం ఉన్న జిల్లాలకు రూ.2 కోట్లు చొప్పున నిధుల విడుదల చేస్తున్నాం.
• పట్టణ ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో అధికారులు తక్షణ చర్యలకు దిగాల్సిన అవసరం ఉంది.
• ప్రోక్లెయినర్లు పెట్టి నీటి ప్రవాహాలకు ఉన్న అడ్డంకులను తొలగించాలి.
• నీటి ప్రవాహాలకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను యుద్దప్రాతిపదికన తొలగించి నీరు బయటకు వెళ్లేలా చూడాలి.
• ఓపెన్ డ్రైన్స్ లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది….ఇలాంటి ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేయండి…అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలి.
• బుడమేరులో నీటి ఉదృతి తీవ్రంగా ఉందని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర, అధికారులు.
• బుడమేరు ఆక్రమణ వల్ల వరద సమయంలో సమస్యలు వస్తున్నాయని వివరించిన అధికారులు…సమస్య పరిష్కారానికి అవసరమైన ప్రణాళికతో రావాలన్న సిఎం
• వరద ప్రాంతాల్లో, వాగులపై వాహనదారులను అనుమతివద్దు. ఈ విషయంలో కఠినంగా నిబంధనలు అమలు చేయండి
• ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న వంతెనలపై రాకపోకలు నిలిపివేయండి.
• ప్రకాశం బ్యారేజ్ నుంచి పంటకాలువలకు నీటి విడుదల నిలపివేసినట్లు వివరించిన అధికారులు
• విజయవాడ నగరంలో రోడ్లపై నిలిచిన నీటిని బయటకు పంపేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించిన అధికారులు
• భారీ వర్షాలు, గాలుల వల్ల తీగలు తెగి విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది….కరెంట్ సమస్యలపై ఫిర్యాదు వచ్చిన వెంటనే అధికారులు స్పందించాలి.
• కనకదుర్గ టెంపుల్ లో ప్రమాదం విచారకరం…..భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోండి
• కొండ ప్రాంతాల్లో ఉన్నవారిని అవసరం అయితే ఖాళీ చేయించండి. ప్రజలు కూడా అధికారుల సూచనలు పాటించాలి.
• పంట కాలువల్లో, డ్రైన్ లలో నీటి ప్రవాహాలకు అడ్డులేకుండా చూడండి.
• సైక్లోన్ షెల్టర్స్ ను సిద్ధం చేసి పునరావాసం కోసం ఏర్పాట్లు చేయండి
• గర్భిణుల వివరాలు సేకరించి…అవసరమైన సాయం అందించేందుకు సిద్దంగా ఉండండి
• మీడియా, సోషల్ మీడియా ద్వారా, ప్రభుత్వ శాఖల ద్వారా క్షణక్షణం ప్రతి సమాచారాన్ని తెలుసుకుంటున్నా….అధికారుల అలసత్వం కనిపిస్తే సహించేది లేదు.
• పెదకాకాని ఉప్పలపాడు వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి చెందిన ఘటనపై అధికారులను వివరణ కోరిన సిఎం
• పాఠశాలకు సెలవు ఇవ్వలేదా అని అధికారులను ప్రశ్నించిన సిఎం
• మధ్యాహ్నం తరువాత సెలవు ప్రకటించి విద్యార్థులను పంపారన్న అధికారులు
• భారీ వర్షాలు ఉన్న జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలి….ప్రైవేటు సంస్థలు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి.
• వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం ఆధారంగా ముందు రోజే సెలవుపై ప్రకటన చెయ్యాలి
• ప్రమాదం జరిగిన తరువాత ప్రభుత్వం సహాయం చేయడం కాదు….ప్రమాదం జరగకుండా చూడడం పై యంత్రాంగం దృష్టిపెట్టాలి
• భారీ వర్షాలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నాను…అధికారులు కూడా వాట్స్ యాప్ గ్రూపుల ద్వారా సమాచారం తెప్పించుకుని వేగంగా స్పందించాలి
• అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్న ఘటన జరిగినా సహించేది లేదు….విపత్తు సమయంలో ప్రజలకు అండగా నిలవాలి
• హుద్ హుద్ తుఫాను సమయంలో అనుసరించిన విధానాలను కలెక్టర్లు స్టడీ చేయాలి….నాడు తీసుకున్న పటిష్ట, ముందస్తు చర్యల ద్వారా ప్రాణ నష్టం లేకుండా చేశాం.
• ఆ విధానాలను స్టడీ చేసి అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *