Breaking News

రామలింగేశ్వర నగర్, కృష్ణలంక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించండి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రామలింగేశ్వర్ నగర్ కృష్ణలంక తదితర ప్రాంత ప్రజలను వరదల వల్ల ముంపు ఉండే అవకాశాలు ఉన్నందున వెంటనే పునరావస కేంద్రాలకు తరలించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. వెంటనే అధికారులు చర్యలు చేపట్టి రిటైనింగ్ వాల్ వెంబడి ఉండే 15 నుండి 21 డివిజన్ ప్రాంత ప్రజలకు వరదల వల్ల ప్రమాదాలకు గురగే అవకాశం ఉందని హెచ్చరించి వారిని పునరావస కేంద్రాలకు తరలించారు. దాదాపు 250 కుటుంబాలను సర్కిల్ 3 పరిధిలో ఉన్న పునరావస కేంద్రాలకు తరలించారు. ఆ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ప్రమాదానికి గురయ్యా అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెంటనే వారి వారి నివాస ప్రదేశాల నుండి తరలి ప్రభుత్వం వారు కల్పించిన పునరావస కేంద్రాల్లో వెళ్లాలని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *