Breaking News

సీల్డ్ టెండర్లను ఆహ్వానం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనికిరాని పేపర్లు పాత కాగితాలు పాత డిస్పోజల్స్, వినియోగం లేని దాదాపు ఒక టన్ను కొనుగోలుకు సంబంధించి సీల్డ్ టెండర్లను ఆహ్వానించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి కే.చంద్రశేఖర రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల ఆరవ తేదీ సోమవారం నుండి 16వ తేదీ వరకు జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయ చాంబర్ నందు సీల్డ్ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని కార్యాలయ పనిదినాలలో ఇందుకు సంబంధించిన కొటేషన్లను సమర్పించవచ్చునన్నారు. నిర్ణీత గడువు లోగా దాఖలు చేసిన అర్హత గల దరఖాస్తులను పరిశీలించి అత్యధిక కొటేషన్ కోటే చేసిన దరఖాస్తుదారునికి పనికిరాని పేపర్లు, పాత కాగితాలు, పాత డిస్పోసల్స్ కొనుగోలు చేసుకునేందుకు అర్హతగా పరిగణించడం జరుగుతుందని డిఆర్ఓ కే. చంద్రశేఖర రావు ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *