ఏలూరు/ముసునూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ముసునూరు మండలం వేలుపుచర్ల లోని ఆరు ఏకరాలు కొండ పోరంబోకు భూమిని ఇండ్ల స్థలాలు కొరకు అధికారులు, కూటమి నాయకులతో కలిసి రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఆరు ఏకరాలు భూమిని సర్వే చేసి,చదును చేసి ఇండ్ల స్థలాలకు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఎంతమందికి ఇండ్ల స్థలాలు పట్టాలు ఇవ్వవచ్చునని తహశీల్దారును మంత్రి అడగగా 60 మందికి ఇవ్వవచ్చునని తెలిపారు. సర్వే పనులు, లెవిలింగు పనులు పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు ఇండ్ల పట్టాలు అందజేయటకు సిద్ధం చేయాలని మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు కె.వెంకటరమణ,యంపిడివో బి.ఏ.సత్యనారాయణ, కూటమి నాయకులు,గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News