రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
International Women’s Day సందర్భంగా ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు తూర్పుగోదావరి జిల్లా ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా విభాగం చైర్పర్సన్ శ్రీమతి ఎం. నాగలక్ష్మి వందన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మహిళల సాధికారత, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రపై ఆమె ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల కోసం వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. పోటీలలో విజేతలుగా నిలిచిన ఉద్యోగులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ వేడుకల్లో ఏపీజేఏసీ అమరావతి నాయకులు, మహిళా విభాగం సభ్యులు, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మహిళల ఐక్యత, సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
Prajavartha Online Telugu News