-జగనన్న గృహ నిర్మాణం వేగవంతం చేయండి
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో కొండపావులూరు ప్రాంతంలో జరుగుతున్న జగనన్న సంపూర్ణ గృహ నిర్మాణ పథకం అమలు విషయంలో జాప్యం జరగకుండా స్పెషల్ ఆఫీసర్లు దృష్టి సారించి జగనన్న ఇళ్ళ లే అవుట్ లో మౌలిక వసతుల పనులు వేగవంతము చేసి లబ్దిదారుల గృహ నిర్మాణాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ అధికారులకు ఆదేశించారు. అదే విధంగా లేఔట్లలో అంతర్గత రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అధికారులు కృషి చేయాలని ఆదేశాలు జారీచేసినారు. సంబందిత కాంట్రాక్టులను కూడా గృహ నిర్మాణాలు వేగవంతముగా చేపట్టి త్వరితగతిన పూర్తి చేయునట్లుగా చూడాలని అన్నారు. పర్యటనలో స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ గురునాద్, హౌసింగ్, యు.సి.డి క్షేత్ర స్థాయి సిబ్బంది మరియు పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News