Breaking News

సకల దేవతా స్వరూపం గోమాత: మల్లాది విష్ణు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గోమాత సకల దేవతా స్వరూపమని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. సత్యనారాయణపురంలో సోమవారం జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మానవజాతి మనుగడకు అనాదిగా గోమాత చేస్తున్న సేవ వెలకట్టలేనిద‌ని పేర్కొన్నారు. మన పూర్వీకులు గోవులను ఆస్తులుగా పరిగణించేవార‌ని, కట్నకానుకల రూపంలో కూడా గోవులనే ఇచ్చేవార‌ని తెలిపారు. రాజ్యాల ఆర్థికబలానికి గోవులు ఒక సూచికలా ఉండేవ‌ని.. వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నుంచి నేటి వరకు గోవు లేని సమాజాన్ని ఊహించలేమ‌ని చెప్పారు. కృష్ణుని రూపం పూజ‌లందుకునే ప్రతిచోటా వెనుకే గోమాత ఉంటుందన్నారు. నేటి ఆధునిక సమాజంలోనూ గృహప్రవేశాలు, ఆల‌య కుంభాభిషేకాలు, ఇతర శుభకార్యాలలో ముందుగా గోవును ప్రవేశ‌పెట్టే సంప్రదాయం న‌డుస్తోంద‌న్నారు. భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమిని జరుపుకుంటే గోదానం చేసిన ఫలితం వస్తుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. శ్రీ కృష్ణ పరమాత్ముని కృపా కటాక్షాలు నియోజకవర్గ ప్రజలపైన ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చాంద్ శర్మ, యల్లాప్రగడ సుధీర్, ఆర్కే, పసుపులేటి యేసు, వెన్నం రత్నారావు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *