Breaking News

ఎసిఏ త‌రుఫున సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటిరూపాయ‌లు అంద‌జేత

-ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌లిసిన ఎంపి కేశినేని శివ‌నాథ్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎసిఏ అధ్య‌క్షుడిగా ఎంపి కేశినేని శివ‌నాథ్ ఎసిఏ త‌రుఫున వ‌ర‌ద బాధితుల స‌హాయార్ధం ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి కోటి రూపాయ‌ల చెక్ ను స‌చివాల‌యంలో మంగ‌ళ‌వారం ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకి అంద‌జేశారు. ఎసిఏ అధ్యక్షుడి ఎన్నికైన సంద‌ర్భంలో ఎంపి కేశినేని శివ‌నాథ్ ఎసిఏ త‌రుఫున వ‌ర‌ద బాధితుల సహాయార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయ‌లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు సీఎం చంద్ర‌బాబుకు కోటి రూపాయ‌లు చెక్ ను అంద‌జేయటం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఎసిఏ ఉపాధ్యక్షుడు వెంకట ప్రశాంత్, కార్యదర్శి సానా సతీష్, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ గౌరు విష్ణు తేజ్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *