నేటి పత్రిక ప్రజావార్త :
Read More »Daily Archives: April 7, 2024
ఏపీలో మూడు రోజులు వర్షాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రేపటి (సోమవారం) నుంచి రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్సుంది. పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి ఊరటనిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Read More »సమాజంలో జర్నలిస్టులది గురుతర బాధ్యత
-ఏపీ మీడియా అకాడమీ సెక్రెటరీ ఎం. మణిరాం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టులపై గురుతర బాధ్యత ఉందని, అది విస్మరించకుంటే సమాజానికి మేలు చేకూరుతుందని ఏపీ మీడియా అకాడమీ సెక్రెటరీ ఎం. మణిరాం పేర్కొన్నారు. పెన్ జర్నలిస్ట్స్ సంఘం విశాఖపట్నం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన భవన్ లో ఆదివారం ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాగనబోయిన నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఉగాది ఉత్సవాల వేడుకలో మీడియా …
Read More »మాదిగ, ఉపకులాల సమగ్రాభివృద్ధి సాధించాలంటే చంద్రబాబుతోనే… : పేరుపోగు వెంకటేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాదిగ, ఉపకులాల సమగ్రాభివృద్ధికి టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించి టిడిపి అధినేత చంద్రబాబు విజయ సాధనకు కృషిచేసి వర్గీకరణ సాధించుకుందామని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ పిలుపునిచ్చారు. అదివారం గాంధీనగర్లోని ప్రెస్క్లబ్లో ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో 35 మాదిగ కులాల సంఘాల ప్రతినిధులతో రాజకీయ నిర్ణయంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాదిగలు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం …
Read More »నదుల అనుసంధానంతో కృష్ణా డెల్టాకు మహర్దశ
-సంక్షేమ రాష్ట్రం కావాలా.. సంక్షోభ రాష్ట్రం కావాలా? -ప్రగతి కోసం ఓటేయమని రాష్ట్ర ప్రజలకు విన్నపం -పామర్రు ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాగళం. ఇది ప్రజలగళం. నిమ్మకూరు.. సాధారణ కుటుంబం నుండి వచ్చిన నందమూరి తారకరామారావు పుట్టారు. ఎన్టీఆర్ ఒక చరిత్రకు స్ఫూర్తి. ఇక్కడి నుండి వచ్చిన వ్యక్తి తెలుగు వారి సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. దీక్ష పట్టుదల ఉంటే సామాన్యులు కూడా అధ్వితీయ శక్తులుగా మారుతారనడానికి ఎన్టీఆర్ నిదర్శనం. మనల్ని వదిలి …
Read More »అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్యవైశ్య కుటుంబాల అభ్యున్నతికి తమ సంఘం ఎల్లపుడూ కృషి చేస్తుందని అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులు CA గడ్డం సత్యనారాయణ అన్నారు. ఆర్యవైశ్య విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ విధ్యా నిధి ట్రస్ట్ ఏర్పాటు చేసి వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. ఈ సందర్బంగా ఏర్పాటైన నూతన కార్యవర్గ సభ్యులకు అయన శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం అమ్మ కల్యాణ …
Read More »ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన పాల్పడే వారిపై నిర్భయంగా ఫిర్యాదుల చెయ్యవచ్చు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన పాల్పడే వారిపై నిర్భయంగా ఫిర్యాదుల చెయ్యవచ్చునని జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల నమోదు కోసం 1950 ట్రోల్ ఫ్రీ నెంబర్ తో పాటు గా జిల్లా స్థాయిలో టోల్ ఫ్రీ నెంబర్ 1800- 425 – 2540 కలెక్టరేట్ లో ఏర్పాటు చెయ్యడం జరిగిందనీ , వీటితో పాటు గా సి విజిల్ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై …
Read More »యువత మరియు పట్టణ ఓటర్లను నిమగ్నం చేయాలనే లక్ష్యంతో ఇసిఐ చేపడుతున్న పలు కార్యక్రమాలు
-2024 సార్వత్రిక ఎన్నికలలో సామాజిక మాధ్యమాల ద్వారా యువత మరియు పట్టణ ఓటర్లను నిమగ్నం చేయాలనే లక్ష్యంతో ఇసిఐ చేపడుతున్న పలు కార్యక్రమాలు -ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనడానికి ‘టర్నింగ్ 18’ ప్రచారం ద్వారా యువ, మొదటిసారి ఓటర్లను ప్రోత్సహించడం -పోలింగ్ వ్యవస్థతో సహా ఎన్నికల ప్రక్రియలోని అన్ని వాటాదారుల ప్రాముఖ్యతను గుర్తించి ఏ ఒక్క ఓటరూ వెనకబడకూడదు అనే నినాదంతో ‘యు ఆర్ ది వన్’ కార్యక్రమం. -యువత లక్ష్యంగా ‘జెనరేషన్ జీ’ విధానంలో ఆకర్షణీయమైన కంటెంట్ తయారీ, వితరణ -ఎన్నికల ప్రక్రియపై నకిలీ …
Read More »ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను తీసుకువచ్చిన సువిధ పోర్టల్
-సాధారణ ఎన్నికలు 2024 ప్రకటించినప్పటి నుండి సువిధ పోర్టల్లో అందిన 73,000 దరఖాస్తుల్లో 44,600 కంటే ఎక్కువ ఆమోదం -ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ సూత్రం ప్రాతిపదికన పార్టీలు మరియు అభ్యర్థులకు అవకాశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రకటన మరియు ఎన్నికల ప్రవర్తనా నియమావళి కార్యరూపం దాల్చిన కేవలం 20 రోజుల వ్యవధిలో సువిధ పోర్టల్ లో రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థుల నుండి 73,379 అనుమతి అభ్యర్థనలు అందగా.. వాటిలో 44,626 అభ్యర్థనలు (60%) ఆమోదించబడ్డాయి, 11,200 అంటే …
Read More »వడదెబ్బ బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలి
– జిల్లా ప్రజలకు కలెక్టర్ ఎస్.డిల్లీరావు సూచన – చిన్నచిన్న జాగ్రత్తలే ప్రాణాలకు పెద్ద రక్ష – పెద్దఎత్తున అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎండ తీవ్రతకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. పంచాయతీరాజ్, మునిసిపల్, గ్రామీణనీటిసరఫరా, వైద్య ఆరోగ్యం తదితర శాఖల …
Read More »