Breaking News

Daily Archives: April 13, 2024

మతతత్వ పార్టీలకు దూరంగా ఉండండి… : తాంతియా కుమారి 

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో బిజెపి పార్టీ తోపాటు రాష్ట్రంలో ఆ పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీలకు దూరంగా ఉండాలని తిరువూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి తాంతియా కుమారి శనివారం పిలుపు నిచ్చారు. అన్ని వర్గాలను ఆదరెంచే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆ విలేఖర్లతో మాట్లాడుతూ తల్లిని, చెల్లిని పట్టించుకోని నాయకుడు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారని ఆమె ప్రశ్నించారు. దళిత, గిరిజన బడుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతి గా తమ తండ్రి …

Read More »

వస్త్రలత సమస్యలు పరిష్కరిస్తా… : సుజన చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడకి తలమానికంగా ఉన్న వస్త్రలత లో సమస్యలు నేటికీ పరిష్కారం కాకపోవడం దురదృష్టకరమని అన్నారు. గత పాలకులు వస్త్రలత అభివృద్ధిని విస్మరించారన్నారు. ప్రచారంలో భాగంగా శనివారం వస్త్రలత ను సందర్శించారు. వస్త్రలత టెక్స్ టైల్స్ అసోసియేషన్ ను సందర్శించి సభ్యులతో మాట్లాడారు. వస్త్రలత అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓలేటి జగన్మోహనరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సుజనా చౌదరి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే గా గెలవగానే వస్త్రలత సమస్యలు పరిష్కరిస్తామన్నారు. 60 ఏళ్లుగా వస్త్రలత లో వ్యాపారస్తులు చేస్తున్న …

Read More »

బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వివి ప్యా ట్స్ లు స్ట్రాంగ్ రూమ్‌లో ఉంచి  సీలు…

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రీ రూరల్ పార్లమెంట్,  అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించిన అన్ని బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వివి ప్యా ట్స్ లు విజయవంతంగా స్ట్రాంగ్ రూమ్‌లో ఉంచి  సీలు వేయడం జరిగిందనీ రాజమండ్రీ రూరల్ రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో పోలీసు భధ్రత మధ్య 051- రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజక వర్గం కు చెందిన ఈ వి ఎమ్ లను …

Read More »

విజయవాడ “మేమంతా సిద్ధం” బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి

-సీఎం జగన్ పై రాయితో దాడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డాడు ఓ ఆగంతకుడు. విజయవాడ “మేమంతా సిద్ధం” బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం జగన్‌ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది.  అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్‌ కనుబొమ్మకు తాకింది. సీఎం జగన్‌పై క్యాట్‌ బాల్‌తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. …

Read More »

దుర్గమ్మ ప్రభావం- కొప్పరపు కవుల ప్రాభవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉగాది ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ సన్నిధిలో సాంస్కృతిక ఉత్సవాలు అపురూపంగా జరుగుతున్నాయి. కళలు, సాహిత్యం, సంగీతం, ఆధ్యాత్మికం అన్నింటినీ మేళవిస్తూ నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు భక్తుల నుంచి విశేషంగా స్పందన వస్తోంది. శనివారం నాడు కొప్పరపు కవుల దుర్గా ఉపాసన, వారి సాహిత్య, జీవిత వైభవంలో అమ్మవారి ఆశీస్సుల ప్రభావంపై ప్రవచనం ఏర్పాటుచేశారు. కొప్పరపు కవుల మనుమడు చేసిన ఉపన్యాసం విశేషంగా ఆకట్టుకుంది. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో కొప్పరపు కవులలో పెద్దవారైన వెంకటసుబ్బరాయకవికి ఎదురైన అనుభవాలను ‘దైవసంకల్పం’ …

Read More »

మన సంస్కృతి ప్రతిబింబమే ఉగాది…

-మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి రెడ్డి. -ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది నంది పురస్కరాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగువారి ఇంట వెలుగులు తెచ్చే పండుగే ఉగాది పర్వదినం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి రెడ్డి అన్నారు. శనివారం ఉదయం రాజమండ్రిలోని ధర్మంచర కమ్యునిటి హాల్ లో క్రోధి నామ ఉగాదిని పురస్కరించుకుని సభ ఏర్పాటు అయ్యింది. శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు డా.కత్తిమండ ప్రతాప్ అధ్యక్షతన ఫిలాంత్రోపిక్ సొసైటీ …

Read More »

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

భగవంతుని సేవతో అంతులేని సంతృప్తి

-టీటీడీ నిత్యాన్నదాన పథకానికి కూరగాయల అందజేత -డిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థ దాతృత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో వివిధ వర్గాల వారు భగవంతుని అనుగ్రహం కోసం చేస్తున్న ఆరాధనతో సమానమైన సంతృప్తి లక్షలాది మందికి అన్న ప్రసాదం అందిస్తున్న స్వామివారి నిత్య అన్నదాన పథకానికి కూరగాయలు అందించడం ద్వారా లభిస్తుందని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు అన్నారు. టీటీడీ నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి కూరగాయల అందజేత కార్యక్రమంలో ఆయన శనివారం పాఠశాల డైరెక్టర్ …

Read More »

దోష రహితంగా ఈవీఎంల కేటాయింపు ప్ర‌క్రియ‌

– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తొలి విడ‌త ర్యాండ‌మైజేష‌న్ ద్వారా పార్ల‌మెంట‌రీ, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఈవీఎంల కేటాయింపు ప్ర‌క్రియ స‌జావుగా, దోష ర‌హితంగా జ‌రిగిన‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. క‌లెక్ట‌రేట్‌లో శుక్ర‌వారం నిర్వ‌హించిన ర్యాండ‌మైజేష‌న్ ప్ర‌క్రియ ఆధారంగా గొల్ల‌పూడి ఈవీఎం గోదాము వ‌ద్ద పార్ల‌మెంట‌రీ, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఈవీఎంల కేటాయింపు ప్ర‌క్రియ ప్రారంభం కాగా.. శ‌నివారం కూడా ఇది కొన‌సాగింది. జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.. జాయింట్ క‌లెక్ట‌ర్ పి.సంప‌త్ కుమార్‌, విజ‌య‌వాడ మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ …

Read More »

1,216 ఫిర్యాదుల ప‌రిష్కారం

– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి (ఎంసీసీ) అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఓట‌ర్ హెల్ప్‌లైన్‌, నేష‌న‌ల్ గ్రీవెన్స్ స‌ర్వీసెస్ పోర్ట‌ల్ (ఎన్‌జీఎస్‌పీ) త‌దిత‌ర మార్గాల ద్వారా 1,250 ఫిర్యాదులు రాగా 1,216 ఫిర్యాదుల ప‌రిష్కార ప్ర‌క్రియ పూర్త‌యింద‌ని, మిగిలిన‌వి పురోగ‌తిలో ఉన్నాయ‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఓట‌రు హెల్ప్‌లైన్ (1950) ద్వారా 195 ఫిర్యాదులు రాగా 195 ఫిర్యాదుల ప‌రిష్కారం పూర్త‌యింద‌న్నారు. ఎన్‌జీఎస్‌పీ ద్వారా 384 …

Read More »