Breaking News

Daily Archives: April 16, 2024

సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సకల గుణధాముడు, ఏకపత్నీవ్రతుడు, పితృవాక్పరిపాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆదర్శప్రాయమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏటా వసంత రుతువులో చైత్రశుద్ధ నవమి రోజు వైభవంగా జరిగే శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా శ్రీరామచంద్రుడు ఏనాడూ ధర్మాన్ని వీడలేదన్నారు. లోకకళ్యాణం …

Read More »

18 న నోటిఫికేషన్ జారీతో ప్రారంభమయ్యే అసలైన ఎన్నికల ప్రక్రియకు సిద్దంకండి

-క్రమం తప్పకుండా ప్రతి రోజూ నివేదికలు పంపేందుకు సిద్దంకండి* -సి-విజిల్ పిర్యాదులను సంతృప్తికర స్థాయిలో పరిష్కరిస్తున్నందుకు డిఇఓ లకు అభినందనలు -పోలింగ్ పక్రియ,కేంద్రాలు వెబ్ కాస్టింగ్ ద్వారా గరిష్ట స్థాయిలో కవర్అయ్యేలా చర్యలు తీసుకోండి -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 18 న నోటిఫికేషన్ జారీతో ప్రారంభమయ్యే అసలైన ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారులు అందరూ సిద్దం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ …

Read More »

సలహాదారులకూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులై క్యాబినెట్ మంత్రి హోదాలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుండి జీత భత్యాలు పొందుతున్న దాదాపు 40 మంది ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది స్పష్టం చేస్తూ భారత ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనకు సంబంధించి కమిషన్కు అనేక ఫిర్యాదులు అందాయని, నిర్దేశిత పనికి బదులుగా, వారు రాజకీయ ప్రచారం/రంగంలోకి ప్రవేశిస్తున్నారని మరియు ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ విలేకరుల సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారని …

Read More »

రాష్ట్ర/జిల్లా స్థాయిలో MCMC కమిటీల ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రచురించకూడదు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజు రాష్ట్ర/జిల్లా స్థాయిలో MCMC కమిటీల ముందస్తు అనుమతి లేకుండా ప్రింట్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించకూడదని ఎలక్షన్ కమిషన్ ఉత్వర్వులు జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గతంలో పలు సందర్భాల్లో ప్రింట్ మీడియాలో అభ్యంతరకరమైన మరియు తప్పుదారి పట్టించే ప్రకటనలు ప్రచురితమైనట్లు ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చినట్లు …

Read More »

ఎన్నికల షెడ్యూల్ విడుదల అనంతరం మొదటి నెల వ్యవధిలో MCC అమలుపై భారత ఎన్నికల సంఘం స్థితి

-ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు విషయంలో అన్ని పార్టీలు/అభ్యర్థులు సమాన ప్రాతిపదికన పరిగణించబడ్డాయి -కమిషన్ చట్ట-న్యాయ ప్రక్రియలో తలదూర్చదు, అదే విధంగా చట్టాన్ని జవదాటదు -రానున్న రోజుల్లో నిఘా మరింత కఠినతరం చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం -క్షేత్ర స్థాయిలో నిజాయితీ కలిగిన అధికారుల వల్లే ఎన్నికల నియమావళి సక్రమంగా అమలై అభ్యర్థులకు ప్రచారం చేసుకునే స్వేచ్ఛ కాపాడబడుతున్నది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఒక రకంగా చెప్పాలి అంటే కమిషన్ ఏ విధంగానూ …

Read More »

తాగునీటి ఎద్దడి గల ఆవాసాలకు జూన్ నెలాఖరు వరకు ట్యాంకులు ద్వారా మంచినీటిని సరఫరా చేయండి.

-అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపండి -ట్యాంకులు ద్వారా నీటి సరఫరాకు సంబంధించిన ప్రతిపాదనలకు స్క్రీనింగ్ కమిటీలో ఆమోదం ఇస్తాం -ఉపాధి హామీ పథకంలో వాటర్ కన్జర్వేషన్ పనులను వెంటనే మొదలు పెట్టండి -రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోండి -సిఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆర్డబ్ల్యుఎస్,మున్సిపల్ మంచినీటి …

Read More »

ఎస్.హెచ్.జి.లను ప్రభావితం చేసే కార్యక్రమాలు నిర్వహించ కూడదు

-పిఆర్&ఆర్డి, ఎమ్ఏ&యుడి శాఖల అధికారులను కోరిన సిఇఓ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల షెడ్యూలు ప్రకటించనప్పటి నుండి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసే విదంగా ఎటు వంటి కార్యక్రమాలను నిర్వహించ కూడదంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సంబందిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ది, రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖల ఆద్వర్యంలో పనిచేసే సంబందిత …

Read More »

ఎపిక్ కార్డులను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి

-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ -ఎపిక్ కార్డులను పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా సంబంధిత ఓటర్లకు అందజేయడం జరుగుతుందని, రిటర్న్ అయిన వాటిని సంబంధిత బి ఎల్వో ల ద్వారా పంపిణీ చేయడం జరుగుతోంది తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎపిక్ కార్డులను పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా, ఒకవేళ పోస్ట్ నుండి రిటర్న్ అయిన వాటిని సంబంధిత బిఎల్వో ల ద్వారా మాత్రమే సంబంధిత ఓటర్లకు అందజేయడం జరుగుతోందని ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, అలా కాదని తప్పుడు …

Read More »

నామినేష‌న్ల ప్ర‌తి ద‌శ‌పైనా ప్ర‌త్యేక దృష్టి

– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో మ‌రో ముఖ్య‌మైన ద‌శ నామినేష‌న్ల ప్ర‌క్రియ ఈ నెల 18న ప్రారంభం కానున్నందున ఈ ద‌శ‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. మంగ‌ళ‌వారం స‌చివాల‌యం నుంచి రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముకేష్ కుమార్ మీనా.. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, క‌లెక‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌య వీసీ హాల్ నుంచి క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.. జాయింట్ క‌లెక్ట‌ర్ …

Read More »

జిల్లాలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌. జవహర్‌రెడ్డికి వివరించారు. రాష్ట్ర సచివాలయం నుండి మంగళవారం వేసవిలో త్రాగునీటి సరఫరా, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, విద్యుత్‌ సరఫరా తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరరెన్స్‌ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌. జవహర్‌రెడ్డి సమీక్షించారు. నగరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుండి మంగళవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌ …

Read More »