Breaking News

Daily Archives: April 20, 2024

“మే ” ఎండలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రియల్ లోనే వచ్చిన ఈ వేసవిలో ఇప్పటినుండే వీస్తున్న వేడివడ గాల్పులు వీటితో రేపూ “మే” లో ఉత్పన్నమయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? వాటి కారణంగా ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయాలి? ఎల్లప్పుడూ హైడ్రేడెట్‌గా ఉండాలి. సమయానుకూలంగా నీళ్లు తాగుతూ ఉండాలి. ఎండలి మండిపోతున్నాయి కాబట్టి.. ప్రత్యక్ష సూర్యకాంతిని నిరోధించేందుకు ప్రయత్నించాలి. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య.. బయట తిరగకుండా ఇండోర్స్‌లోనే ఉండాలి. ఏం చేయకూడదు? ఈ …

Read More »

మరకత శివలింగ వాయుప్రతిష్ట కరపత్రాల ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రాషిర్డీగా విరాజిల్లుతున్న ముత్యాలంపాడు శ్రీషిర్డీ సాయిబాబా మందిరంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు మరకత శివలింగ వాయు ప్రతిష్ట మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి తెలిపారు. ముత్యాలంపాడు శ్రీషిర్డీ సాయిబాబా మందిరంలో శనివారం మరకత శివలింగ వాయుప్రతిష్ట కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు స్వయంగా అభిషేకం చేసుకునే విధంగా మందిరంలో మరకత శివలింగ వాయు ప్రతిష్ట చేస్తున్నామని తెలిపారు. సోమవారం …

Read More »

నిలకడలేని ఆరోపణలు తగదు… : కార్పొరేటర్‌ బాలి గోవింద్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన రాయితో కొట్టిన సంఘటనపై ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నిలకడలేని ఆరోపణలు చేయడం తగదని సెంట్రల్‌ నియోజకవర్గం 36వ డివిజన్‌ కార్పొరేటర్‌ బాలి గోవింద్‌ ఖండించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలి గోవింద్‌ మాట్లాడుతూ గతంలో కోడికత్తి సంఘటనతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు గులకరాయి సంఘటనతో సానుభూతితో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని నోటి కొచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. అన్నాక్యాంటీన్‌ కోసమని కాసేపు ప్రచారానికి పిలిచి …

Read More »

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాల‌కు కౌన్సెలింగ్

– కృష్ణా, ఎన్‌టీఆర్ జిల్లాల స‌మ‌న్వ‌య అధికారి బి.సుమిత్రా దేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మిగిలిన సీట్లకు ఈ నెల 22, 23 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు కృష్ణా, ఎన్‌టీఆర్ జిల్లాల స‌మ‌న్వ‌య అధికారి బి.సుమిత్రా దేవి శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాల్లో 2024-25 విద్యా సంవ‌త్స‌రంలో 5వ త‌ర‌గ‌తిలో చేరేందుకు కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ప‌రీక్ష‌లో మెరిట్ ప్ర‌కారం ఇప్ప‌టికే మొద‌టి జాబితాలో సీట్లు కేటాయించ‌గా మిగిలిన …

Read More »

అసిస్టెంట్ కలెక్టర్ గా శుభం నోఖ్వాల్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా ఐఏఎస్ 2023 బ్యాచ్ కు చెందిన శుభం నోఖ్వాల్ కలెక్టరు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం శనివారం జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావును మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిష్పక్షపాతంగా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లను డిల్లీరావు గారి నుంచి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ కార్యకలాపాలు, ఫిర్యాదుల నిర్వహణ వ్యవస్థ, రిపోర్టింగ్ నిర్వహణ వ్యవస్థ, ఎన్నికల అధికారులకు సిబ్బందికి …

Read More »

ఎన్నికల వ్యయ పరిశీలకులు రోహిత్ నగర్ ను కలిసిన కలెక్టర్ ఎన్. తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రోహిత్ నగర్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందచేశారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ, జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసిన సమయం నుంచి నిఘా పెట్టడం జరిగిందనీ, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత దిశా …

Read More »

తిరుపతి జిల్లా వ్యాప్తంగా మూడవ రోజు 20 నామినేషన్లు దాఖలు

-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు – 2024 కు సంబంధించి జిల్లాలో మూడవ రోజు 20 నామినేషన్లు దాఖలైనాయని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.00 గంటలకు ప్రారంభయిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మధ్యాహ్నం 3.00 గంటల వరకు కొనసాగిందన్నారు. నియోజకవర్గాల వారీగా మూడవ రోజు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన వివరాలను వెల్లడించారు. దాఖలైన నామినేషన్ల వివరాలు: …

Read More »

జిల్లాస్థాయి ప్రేరణ ఉత్సవ కార్యక్రమం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవ కార్యక్రమం తిరుపతిలోని కేంద్రీయ విద్యాలయం 1 నందు ఘనముగా జరిగినది. ఈ కార్యక్రమంలో తిరుపతి డిప్యూటీ ఎడ్యుకేషనల్ అధికారి బాలాజీ మాట్లాడుతూ అపజయాలను విజయ సోపానాలుగా మలుచుకుని లక్ష్యాలను సాధించాలని తెలియజేశారు. స్టేట్ అబ్జర్వర్ అపర్ణ మాట్లాడుతూ.. గుజరాత్ లోని వాద్ నగర్ లో జరిగే జాతీయస్థాయి ప్రేరణ ఉత్సవ కార్యక్రమానికి ఎంపిక కావడానికి కావలసిన విధివిధానాలను తెలియజేశారు. కేంద్రీయ విద్యాలయంలో రాష్ట్ర పాఠశాలల అనుసంధానం చేయబడి కార్యక్రమాలను నిర్వహించడం చాలా …

Read More »

జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు ఫోన్ చేసి ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు తెలపగలరు

-జిల్లా వ్య‌య‌ ప‌రిశీల‌కుల సెల్ నంబ‌ర్లకు ఎన్నికల వ్యయ ఫిర్యాదులపై ఫోన్ ద్వారా సంప్రదించగలరు -కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, ఏనేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వ్య‌య ప‌రిశీల‌కుల సెల్ నంబ‌ర్ల‌ను జిల్లా యంత్రాంగం ప్ర‌క‌టించింది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని అభ్య‌ర్ధుల ఖ‌ర్చుల‌కు సంబంధించిన ఫిర్యాదుల‌ను ఈ నంబ‌ర్ల‌కు ఫోన్ చేసి తెలియ‌జేయ‌వ‌చ్చునని తెలిపారు. వ్య‌య ప‌రిశీల‌కుల సెల్ నంబ‌ర్లు: 23 – తిరుపతి (ఎస్.సి) పార్లమెంటు నియోజకవర్గ వ్యయ పరిశీలకులు – శ్రీ ప్రదీప్ కుమార్ …

Read More »

జిల్లా కలెక్టరేట్ లోని ఎంసిఎంసి కంట్రోల్ రూం ను పరిశీలించిన ఎన్నికల ఎక్స్పెండీచర్ అబ్జర్వర్లు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరేట్ లోని ఎన్నికల ఎంసిఎంసి కంట్రోల్ రూం ను శుక్రవారం జిల్లాకు కేటాయించబడిన ఎన్నికల ఎక్స్పెండీచర్ అబ్జర్వర్లు విజి శేషాద్రి, మీను ఓల పరిశీలించారు. పరిశీలనలో భాగంగా పెయిడ్ న్యూస్, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా నందు వస్తున్న ప్రకటనలను, పెయిడ్ న్యూస్ లను ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు అని ఆరా తీసి పలు సూచనలు చేశారు. మీడియా నోడల్ అధికారి మరియు ఎంసిఎంసి మెంబర్ సెక్రటరీ బాల కొండయ్య వివరిస్తూ పత్రికలలో, ఎలక్ట్రానిక్ మీడియా, …

Read More »