Daily Archives: July 11, 2026

రాష్ట్రస్థాయి మెగా జాబ్ మేళా–2026

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని షా జహూర్ ముసాఫిర్ ఖానా ఫంక్షన్ హాల్, ఇస్లాంపేటలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి మెగా జాబ్ మేళా–2026 ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన మైనారిటీ యువతీ యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పలు ప్రముఖ కంపెనీలు తమ ప్రతినిధులతో పాల్గొని అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హత ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. …

Read More »

చిరుధాన్యాలు.. ఆరోగ్యం, ఆదాయానికీ బ‌లం

– విలువ ఆధారిత ఉత్పత్తులతో సుస్థిర వ్యాపారం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునిక జీవ‌న‌శైలి నేప‌థ్యంలో సమతుల్య పోషకాహారానికి చిరుధాన్యాలు (మిల్లెట్స్‌) ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయ‌ని.. పీచుపదార్థం, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజలవణాలు సమృద్ధిగా ఉండే చిరుధాన్యాలు ఆరోగ్య‌క‌ర జీవితానికి పునాదులు వేస్తున్నాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. ఈ నేప‌థ్యంలో చిరుధాన్యాల విలువ ఆధారిత ఆహార ఉత్ప‌త్తుల‌కు మంచి డిమాండ్ ఉంద‌ని.. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకొని మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాల‌ని ఆకాంక్షించారు. …

Read More »

మీ భాగ‌స్వామ్య‌మే ఓటు భ‌ద్ర‌త‌కు భరోసా!

– ఎన్యూమ‌రేష‌న్ ఫారాల సమర్పణకు ఇక 3 రోజులే! – క్షేత్రస్థాయిలో ఓట‌ర్ల సేవ‌లో అధికార యంత్రాంగం – బీఎల్‌వోలు, ప్ర‌త్యేక శిబిరాలు, హెల్ప్ డెస్కులు అందుబాటులో – స‌ర్ ప్ర‌క్రియ‌లో విజ‌యం గ‌మ్యానికి చేరువైన డిజిటైజేష‌న్‌ – 14,07,640 (82.15 శాతం) ఎన్యూమ‌రేష‌న్ ఫారాల డిజిటైజేష‌న్ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఈ నెల …

Read More »

పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తైన సందర్భంగా, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని తిరుపతిలోని అలిపిరి శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి టెంకాయలు కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించి, పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని యథావిధిగా ప్రజాసేవలో పాల్గొనాలని మొక్కులు మొక్కారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ …

Read More »

రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే కుట్రలను ప్రభుత్వం ఉపేక్షించదు… : డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో శాంతి భద్రతలు, మత సామరస్యం, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే ఎలాంటి కుట్రలనైనా రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రైస్తవులను రెచ్చగొట్టి మత ఘర్షణలను సృష్టించేందుకు కొందరు రాజకీయ శక్తులు కుట్రలు …

Read More »

ఆర్టీసి పరిరక్షణ,ఉద్యోగుల హక్కుల సాధనలో 75 సంఃలు లలో ఇ.యు కీలకపాత్ర పోషించింది..

-ఇ.యు రాష్ట్రఅధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు,ప్రధానకార్యదర్శి జి.వి.నరసయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంప్లాయీస్ యూనియన్ 75వ ఆవిర్భావ దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను శనివారం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించామని అందులో బాగంగా విజయవాడ డిపో వద్ద జరిగిన ఇ.యు వజ్రోత్సవ వేడుకల్లో పాల్గోన్న ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు,రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.వి.నరసయ్యలు మాట్లాడుతూ 1952లో స్థాపించబడిన ఎంప్లాయీస్ యూనియన్ గత 74 సంవత్సరాలుగా ఆర్టీసీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమం, సేవా నియమాల మెరుగుదల కోసం ఎన్నో …

Read More »

ఘనంగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ వజ్రోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ జోన్ పరిధిలోని ఆటోనగర్, గవర్నర్పేట 1 గవర్నర్పేట 2 డిపో నందు శనివారం ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 75వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జూలై 11 1952లో ఏర్పడి నేటికి 74 సంవత్సరాల పూర్తి చేసుకుని 75 వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా విజయవాడ జోన్వ్యాప్తంగా ఉన్న 31 డిపోలలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు* గవర్నర్పేట వన్ టూ డిపోల నందు రాష్ట్ర కార్యదర్శి ఎస్ ఎస్ …

Read More »

సర్ ప్రక్రియకు 3 రోజులే గడువు ఉంది…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియకు 3 రోజులే గడువు ఉందని, ప్రజల సౌకర్యార్థం అన్ని సచివాలయాలు, నగరంలోని ప్రధాన కూడళ్లు, ప్రముఖ ప్రాంతాలలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిని నింపి, వెంటనే బిఎల్ఓలకు ఇచ్చి సహకరించాలని కోరారు. …

Read More »

పోలింగ్ కేంద్రాల పరిధిలో హెల్ప్ డెస్క్ ల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు మరో 3 రోజులే గడువు ఉన్నందున, ఎన్యూమరేషన్ ఫారాలు నింపి వెంటనే బిఎల్ఓలు లేదా వార్డ్ ల వారీ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ల్లో అందించాలని, లేకుంటే ఈ నెల 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు ఉండకపోవచ్చని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. శనివారం రైల్ పేట, వసంతరాయపురం, నగరంపాలెం ప్రాంతాల్లోని పలు పోలింగ్ కేంద్రాల పరిధిలో …

Read More »

వియాత్నాం ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర విచారం

-ప్రమాదంలో మచిలీపట్నం వాసి మరణం అత్యంత బాధాకరం -బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ -మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వియాత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో 15 మంది భారతీయులు మరణించిన వార్త కలచివేసింది. మచిలీపట్నంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గెల్లి కిషోర్ భార్య జయశ్రీ మరణించడం అత్యంత బాధాకరం. తీవ్ర అస్వస్థతకు గురైన కిశోర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ మేరకు బాధిత కుటుంబ …

Read More »