విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో భారీ వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం వైయస్.జగన్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కాపునేస్తం పథకం అమలు వర్చువల్ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్లకు సీఎం ఈ ఆదేశాలు ఇచ్చారు. వివిధ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సమాచారం నేపథ్యంలో కలెక్టర్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించాలని సీఎం ఆదేశించారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Tags vijayawada
Check Also
అమరావతికి కొత్తరైల్వే లైన్ మంజూరును స్వాగతిస్తున్నాం
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతికి కొత్త రైల్వే లైన్ మంజూరు చేస్తూ …