Breaking News

భారతదేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపిన క్షిపణి పితామహుడు డా. ఏపీజే అబ్దుల్ కలాం…

-మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం పార్టీ కార్యాలయం లో డా. ఏపీజే అబ్దుల్ కలాం  వర్దంతి సందర్భంగా పార్టీ నాయకులు అధికారులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపి, దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం గా ఇనుమడింప చేసిన గొప్ప శాస్త్రజ్ఞుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపిజే అబ్దుల్ కలాం గారు అని కోనియాడారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ పామర్తీ శ్రీనివాసరావు, సి ఐ పి శ్రీను, యస్ ఐ రాంబాబు, తహసీల్దార్ రోహిణి దేవి, మాజీ యంపిపి జోన్నలగడ్డ గంగాదరరావు , ఉప సర్పంచ్ శ్యామల సీతారెడ్డి, యన్ డి పి సోదరులు, యంపీటిసి అభ‌్యర‌్ది రహీమ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు కరీమ్, జడ్పీటిసి అభ‌్యర‌్ది స్వర్ణాల తిరుపతిరావు  స్థానిక నాయకులు పాల్గొన్నారు

Check Also

యువతకు వినూత్న మరియు భవిష్యత్తు నైపుణ్యాలపై సీడ్ యాప్ సంస్థ లో వర్క్‌షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమతో రాష్ట్ర యువతను మమేకం చేసే లక్ష్యంతో వారికి శిక్షణ అందించి మెరుగైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *