-మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు
మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం పార్టీ కార్యాలయం లో డా. ఏపీజే అబ్దుల్ కలాం వర్దంతి సందర్భంగా పార్టీ నాయకులు అధికారులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపి, దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం గా ఇనుమడింప చేసిన గొప్ప శాస్త్రజ్ఞుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపిజే అబ్దుల్ కలాం గారు అని కోనియాడారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ పామర్తీ శ్రీనివాసరావు, సి ఐ పి శ్రీను, యస్ ఐ రాంబాబు, తహసీల్దార్ రోహిణి దేవి, మాజీ యంపిపి జోన్నలగడ్డ గంగాదరరావు , ఉప సర్పంచ్ శ్యామల సీతారెడ్డి, యన్ డి పి సోదరులు, యంపీటిసి అభ్యర్ది రహీమ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు కరీమ్, జడ్పీటిసి అభ్యర్ది స్వర్ణాల తిరుపతిరావు స్థానిక నాయకులు పాల్గొన్నారు