అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా, గోపాలపురంలో డయేరియా ప్రబలటంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. డయేరియా నివారణకు తక్షణ చర్యలు, మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. డయేరియా ప్రబలిన దాదాపు పది గ్రామాలలో 20 వైద్య బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అధికారులు సీఎంకు వివరించారు. అవసరమైతే మరికొన్ని ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇంటింటి సర్వే జరిపి అవగాహన కల్పించాలని ఆదేశించారు. కల్పిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు వివరించారు.
Tags amaravathi
Check Also
గత ప్రభుత్వం హయాంలో అసంపూర్తిగా పిహెచ్ సిల నిర్మాణాలు
-ఆర్భాటంగా నాడు-నేడు కార్యక్రమాన్ని చేపట్టారే తప్ప ప్రయోజనం శూన్యం -కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించనందున నిలిచిపోయిన పిహెచ్సిల నిర్మాణాలు -గిరిజన ప్రాంతాల్లో …