Breaking News

Daily Archives: March 5, 2025

ఏపీ భూ ఆక్రమణ నిషేధ బిల్లు ఆమోదించండి

-అమరావతికి 8 వరుసల అవుటర్ రింగ్ రోడ్డు -నదుల అనుసంధానానికి సహకరించండి -కేంద్రాన్ని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -ఒకేరోజు ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశం -రాష్ట్రంలో సమస్యలు వివరించి పరిష్కరించాలన్న సీఎం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన భూ ఆక్రమణలు, అక్రమాలు, దందాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలోని పది కేసులు నమోదైతే అందులో 6 కేసులు భూ వివాదాలకు సంబంధించినవే ఉంటున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. భూ వివరాల …

Read More »

కేసీ ఆయకట్టు సాగులో ఉన్న పంటలను కాపాడుతాం

-జల వనరుల శాఖ మంత్రి నిమ్మల, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ తో మంత్రి ఫరూక్ భేటీ -కేసీ రైతుల సమస్యను వివరించిన మంత్రి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు- కడప కెనాల్ ఆయకట్టు కింద సాగు చేసిన పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపడతామని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు.ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో రబీ సీజన్ లో వివిధ రకాల పంటలను రైతుల సాగు చేశారు. ఈ …

Read More »

ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం వేసేది లేదు…

నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్న భూములలో కొంతమేర అమ్మడం ద్వారా రాజధాని నిర్మిస్తామన్నారు మంత్రి నారాయణ…అంతే గానీ ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం వేసేది లేదని స్పష్టం చేశారు. అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారాయణ నెల్లూరులో మీడియా తో మాట్లాడారు… రాజధాని నిర్మాణానికి హడ్కో,ప్రపంచ బ్యాంకు,AIIB తో పాటు జర్మనీ బ్యాంకు నుంచి రుణాలు సేకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాజధానిపై ప్రతిపక్షాల మాటలు వినవద్దు…నమ్మవద్దని ప్రజలకు సూచించారు…రాజధాని అమరావతి …

Read More »

మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ధర్మేంద్ర భావ్ సింగ్ లోధీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ధర్మేంద్ర భావ్ సింగ్ లోధీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఎండీ ఆమ్రపాలి కాటా ఐటీబీ-2025 సదస్సులో ఆయనను శాలువాతో సత్కరించారు.అనంతరం వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర భావ్ సింగ్ లోధీ సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో ఉండాల‌ని, ప్రజా సేవ చేయాల‌ని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు. సమాజ శ్రేయస్సుకు కృషి చేసిన ధర్మేంద్రకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు.

Read More »

పారిశ్రామిక వర్గాల్లో తమ ప్రభుత్వం ఒక విశ్వాసాన్ని కలిగించింది… : మంత్రి టి.జి భ‌ర‌త్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆరు నెలల క్రితం పారిశ్రామిక వేత్తలు తమను కలిసినప్పుడు 1947లో స్వాతంత్య్రo చూసామో లేదో కానీ, ఈ ప్రభుత్వం వచ్చాకే నిజమైన స్వాతంత్య్రo చూసామని చెప్పారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ అన్నారు. అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే మాట్లాడే దానికి కానీ లేదా ఏదైనా విషయం అడగడానికి కానీ వీలు కలిగిందని పారిశ్రామికవేత్తలు చెప్పారని మంత్రి తెలిపారు. మంత్రి టి.జి.భరత్ మాట్లాడుతూ పారిస్ లో చాంబర్ …

Read More »

ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలి

– కార్యాల‌య సిబ్బందితో పాటు సంద‌ర్శ‌కుల‌కు త‌గిన ఏర్పాట్లు చేయాలి – వ‌డ‌దెబ్బ‌పై క్షేత్ర‌స్థాయిలో ఇప్ప‌టినుంచే అవ‌గాహ‌న క‌ల్పించాలి – గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో వీలైన‌న్ని ఎక్కువ చ‌లివేంద్రాలు పెట్టాలి – క్షేత్ర‌స్థాయి అధికారుల‌తో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ వీడియో కాన్ఫ‌రెన్స్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేస‌వి వేడిని దృష్టిలో ఉంచుకొని ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాల‌ని, మ‌జ్జిగ‌ను కూడా స‌ర‌ఫ‌రా చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. వేస‌వి కార్యాచ‌ర‌ణ‌పై క్షేత్ర‌స్థాయి అధికారుల‌తో క‌లెక్ట‌ర్ …

Read More »

ఉపాధి క‌ల్ప‌న‌, వేత‌న ల‌క్ష్యాల‌ను చేరుకోవాల్సిందే..

– ప‌థ‌కం ల‌క్ష్యం పూర్తిస్థాయిలో నెర‌వేరేలా అధికారులు, సిబ్బంది కృషిచేయాలి – క్షేత్ర‌స్థాయి అధికారులు నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ చేయాలి – ఉపాధి హామీ ప‌నుల‌పై క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ గ్రామీణ ఉపాధి హ‌మీ ప‌థ‌కం ద్వారా జిల్లాలోని అన్ని మండ‌లాల్లో, గ్రామాల్లో వేత‌న‌దారుల‌కు ప‌ని క‌ల్పించ‌డంలోనూ, దిన‌స‌రి వేత‌నం రూ. 300 వ‌చ్చేలా చూడ‌టంలోనూ నిర్దేశించిన ల‌క్ష్యాల‌ను త‌ప్ప‌నిస‌రిగా చేరుకోవాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. బుధ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ క‌లెక్ట‌రేట్ నుంచి డ్వామా అధికారుల‌తో …

Read More »

పేద‌రికం లేని స‌మాజం ల‌క్ష్యంగా పీ4 స‌ర్వే

– ఈ నెల 8వ తేదీ నుంచి 18 వ‌ర‌కు స‌చివాల‌య సిబ్బంది ద్వారా కార్య‌క్ర‌మం – రెండు రోజుల పాటు మండ‌ల స్థాయిలో శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు – స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో స‌ర్వేను విజ‌య‌వంతం చేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద‌రికం లేని స‌మాజ నిర్మాణం ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప‌బ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్ పార్ట‌న‌ర్‌షిప్ (పీ4) స‌ర్వేకు రూప‌క‌ల్ప‌న చేయ‌డం జ‌రిగింద‌ని.. ఈ నెల 8వ తేదీ నుంచి 18వ …

Read More »

ఫార్మర్ రిజిస్ట్రీ విశిష్ట సంఖ్య నమోదుకు త్వరలో మొబైల్ అప్లికేషన్

-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్ -విశిష్ఠ సంఖ్య నమోదు లో వేగం పెంచి లక్ష్యంలో 75 శాతం ఈ నెలాఖరుకు పూర్తి చేయాలి – తద్వారా రాష్ట్రానికి 3 వ విడత కేంద్ర ప్రత్యేక ఆర్థిక సహాయం కేటాయింపు .(SCA – Special central Assistance) -త్వరలో ముగయనున్న వెబ్ లాగిన్ సేవలు – వాటి స్థానములో ప్రవేశ పెట్టనున్నమొబైల్ అప్లికేషన్ సేవలు – రైతు విశిష్ఠ సంఖ్య నమోదులో ముందు వరసలో ఎన్టీఆర్ జిల్లా ,తరువాతి స్థానములలో శ్రీకాకుళం ,గుంటూరు …

Read More »

ప‌టిష్ట స‌మ‌న్వ‌యంతో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల‌ను విజ‌య‌వంతం చేద్దాం..

– మ‌హిళా భ‌ద్ర‌త‌, సాధికార‌త‌ను ప్ర‌తిబింబించేలా స్టాళ్ల ఏర్పాటు – డీఆర్‌డీఏ, మెప్మా త‌దిత‌ర విభాగాల ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు – గౌర‌వ ప్ర‌జాప్ర‌తినిధుల భాగ‌స్వామ్యంతో వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌హిళా భ‌ద్ర‌త‌, సాధికార‌త‌కు అత్యంత ప్రాధాన్య‌మిస్తున్నాయ‌ని.. వివిధ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల ఫ‌లాల‌ను స్త్రీ శ‌క్తికి చేరువ‌చేసి, వారిని స‌మ‌గ్రాభివృద్ధి దిశ‌గా న‌డిపించేలా అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల‌ను విజ‌య‌వంతం చేద్దామ‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. …

Read More »