Breaking News

Daily Archives: March 1, 2025

ముస్లింలకు రంజాన్‌ రేషన్‌ కిట్ల పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇమామ్‌ ఇబ్న్‌ బాజ్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో మౌలానా సయ్యద్‌ అహమద్‌ మొహమ్మదీ అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్‌ ఫతావుల్లా ముఖ్య అతిథిగా ఏఎస్‌ గ్రాండ్‌ కల్యాణ మండపంలో 500 ముస్లిం కుటుంబాలకు రంజాన్‌ కిట్స్‌ పంపిణీ చేశారు. రంజాన్‌ నెలకు సరిపడా సరుకులు (బియ్యం, కందిపప్పు, పంచదార, చింతపండు, ఇటువంటి మొత్తం 17 సరుకులు) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మొహమ్మద్‌ ఫతావుల్లా …

Read More »

జనసేన ఆవిర్భావ సభ వేదిక నిర్మాణానికి భూమి పూజ

-పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలసి భూమి పూజ చేసిన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి  నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సన్నాహాలు మొదలయ్యాయి. సభా ప్రాంగణం వద్ద వేదిక నిర్మాణం పనులను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం సాయంత్రం భూమి పూజ చేసి …

Read More »

కలసికట్టుగా పని చేద్దాం… ఆవిర్భావ సభను విజయవంతం చేద్దాం

-పిఠాపురం సభపైనే యావత్ దేశం చూపు -నోరుందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. -అలా మాట్లాడినందుకే ఒక వ్యక్తి జైల్లో కూర్చొని లబోదిబోమంటున్నాడు -జనసేనఆవిర్భావ సభ నిర్వహణ కమిటీల సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్, -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం వేదికగా ఈ నెల14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జన సైనికుడు, వీరమహిళ తీసుకోవాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ …

Read More »

రాష్ట్ర బడ్జెట్‌ ఆకాశంలో ధ్రువ నక్షత్రం… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం 8 నెలలు హనీమూన్‌ పూర్తి చేసుకొని, ఆకాశంలో ధ్రువ నక్షత్రం లాంటి బడ్జెట్‌ని ప్రవేశపెట్టి ప్రజల నోట్లో మట్టి కొట్టారని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ ధ్వజమెత్తారు. శనివారం వన్‌టౌన్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్‌లో అభివృద్ధికంటే రాష్ట్ర ప్రజలను దోపిడే చేసుకోవడంలోనే ఎక్కువ శ్రద్ద చూపించారని విమర్శించారు. జగన్మోహన్‌రెడ్డి పేద ప్రజల జీవితాల్లో నవరత్నాల పేరుతో వెలుగులు నింపడం ఆర్థిక విధ్వంసమా అని ప్రశ్నించారు. …

Read More »

‘సూపర్ సిక్స్’ అమలు చేసి తీరుతాం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -బడ్టెట్ ల్ రైతులకు, బీసీలకు పెద్దపీట -జూన్ నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు -ఇప్పటికే ఉచిత ఇసుక, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం -ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసి తీరుతాం -జగన్ లా మాట తప్పే నైజం చంద్రబాబుది కాదు -రాయలసీమను రతనాల సీమ చేస్తాం -చేసిన తప్పులకు ఎంతటివారికైనా శిక్షలు తప్పవు : మంత్రి సవిత పెనుకొండ/సోమందేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని …

Read More »

సర్వజనరంజకంగా రాష్ట్ర బడ్జెట్ :మంత్రి కందుల దుర్గేష్

-పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా, తెలుగు భాషాభివృద్ధిపై రాష్ట్ర చిత్తశుద్ధికి నిదర్శంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని పేర్కొన్న మంత్రి దుర్గేష్ -వినాశనానికి, పతనానికి ఆనవాళ్లుగా గత ప్రభుత్వ బడ్జెట్ నిలిస్తే అభివృద్ధి, పురోగతికి తార్కాణంగా ఈ ప్రభుత్వ బడ్జెట్ నిలిచిందన్న మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే ఐదేళ్ల కాలంలో ఏ రకమైన అభివృద్ధి చేయనున్నామో తెలిపేలా రూపొందిందించిన సమగ్ర బడ్జెట్ 2025-26 అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని తన జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా …

Read More »

ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు: మంత్రి కందుల దుర్గేష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలను ముస్లిం సోదరులందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించాలని, అల్లా దయవల్ల ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

Read More »

మత సామరస్యానికి ప్రతీక రంజాన్

-పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలి -ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు -రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాష్ట్ర రెడ్డి రాయచోటి, నేటి పత్రిక ప్రజావార్త : మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని, ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మార్చి 1వ తేదీ శనివారం రాత్రి నెలవంక కనిపించడంతో పవిత్ర రంజాన్ …

Read More »

పర్యాటక పెట్టుబడుల కోసం మంత్రి కందుల దుర్గేష్ జర్మనీ పర్యటన

-మార్చి 4 నుండి 6 వరకు జర్మనీలో జరిగే ఐటీబీ బెర్లిన్ -2025 సదస్సుకు హాజరవుతున్నానని మంత్రి దుర్గేష్ వెల్లడి -ఏపీ పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్ -అత్యుత్తమ పర్యాటక గమ్యస్థానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతామన్న మంత్రి దుర్గేష్ -త్వరలోనే హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులలో టూరిజం ఇన్వెస్టర్ సమ్మిట్ లు నిర్వహిస్తామన్న మంత్రి దుర్గేష్ -పర్యాటక రంగానికి ఊతమిస్తోన్న పరిశ్రమహోదా, నూతన పర్యాటక పాలసీ, పీపీపీ విధానం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

రాహుల్‌ హత్యపై న్యాయవిచారణ జరపాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాహుల్‌ హత్యకు మాకు ఎలాంటి సంబంధ లేదని గత వైసిపి ప్రభుత్వంలోని మంత్రులు, నాయకులు కావాలనే తనను తనతో పాటు మరి కొందరిని ఇరికించారని కోగంటి సత్యనారాయణ తెలిపారు. శనివారం కృష్ణలంకలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కోగంటి సత్యనారాయణ మాట్లాడుతూ రాహుల్‌ హత్య కేసులో తనను, తనతో పాటు కోరాడ విజయకుమార్‌ పై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారన్నారు. తాను జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత రాహుల్‌ హత్య …

Read More »