Breaking News

Daily Archives: March 22, 2025

నేటి నుంచి శిశిరం చిత్రం రెండవ షెడ్యూల్ ప్రారంభం

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణానికి చెందిన దర్శకుడు కనపర్తి రత్నాకర్ దర్శకత్వం వహిస్తున్న బాలల చిత్రం శిశిరం రెండవ షెడ్యూల్ షూటింగ్ ఆదివారం నుంచి ప్రారంభమవుతుందని రత్నాకర్ శనివారం తెలిపారు. ఆటోనగర్ లోని సూర్య శిల్పశాల, బుర్రిపాలెం రోడ్డులోని వివేకా సెంట్రల్ స్కూల్, జాగర్లమూడి, శేకూరు, కొలకలూరు లలో మూడురోజుల పాటు జరుగుతుందన్నారు. విద్య అవసరాన్ని, మారుతున్న విద్యా వ్యవస్థ, సాంకేతిక అభివృద్ధి ప్రధానాంశాలుగా చిత్రం వుంటుందన్నారు. చిత్రం లో ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్ తండేల్ ఫేమ్ లిటిల్ స్టార్ భాను …

Read More »

ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు

-99.64 శాతం హాజరు -పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ్ రామరాజు.వి ఐ.ఏఎస్., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శనివారం ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -2 (కాంపోజిట్ కోర్సు), ఓఎస్ఎస్సీ (ఓరియెంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్) మెయిన్ లాంగ్వేజ్ పరీక్ష సజావుగా జరిగిందని పాఠశాల విద్య సంచాలకులు విజయ్ రామరాజు.వి IAS.,  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 93,746 మంది విద్యార్థులకు గానూ 93,405 మంది విద్యార్థులు (99.64 శాతం) హాజరయ్యారని, …

Read More »

కూటమి ప్రభుత్వ అసమర్థతతోనే చిన్నారులపై లైంగిక దాడులు

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై పెచ్చరిల్లుతున్న అరాచకాలు, దాడులను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. గన్నవరంలో మైనర్ బాలికపై 8 మంది మృగాళ్ల సామూహిక అత్యాచార ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఐదేళ్ల చిన్నారి నుంచి రోజురోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని.. రాష్ట్రంలో ఎక్కడా మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. …

Read More »

ఎనికెపాడు శ్రీ విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ కాలేజీలో ప్రపంచ నీటి దినోత్సవం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యవజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఎనికెపాడు శ్రీ విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ కాలేజీలో ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం అనే కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెల్ నెస్ అడ్వైజర్ మిస్టర్ కిరణ్ వి విద్యార్థులతో నీటి యొక్క ప్రాముఖ్యత దాని గుణగణాలు మరియు లైవ్ డిమాస్ట్రేషన్ పిపిటి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది …

Read More »

ఘనంగా మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు వర్ధంతి

-దివ్యాంగులకు 40 స్కూటీలను అందించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పెదనాన్న మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు వర్ధంతి వేడుకలు అద్దంకి నియోజకవర్గం లో ఘనంగా జరిగాయి. తొలుత యద్దనపూడి గ్రామానికి చేరుకున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్థానికంగా ఉన్న పెదనాన్న హనుమంతరావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అద్దంకి చేరుకున్న మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అద్దంకి పురపాలక సంఘం కార్యాలయంలో గొట్టిపాటి హనుమంతరావు …

Read More »

ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. మరో వారంరోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖలో స్థితిగతులపై చర్చించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికారులతో రివ్యూ చేశారు. కేంద్రంలోని ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులు వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర పథకాలకు సంబంధించి అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించి…సకాలంలో నిధులు విడుదల అయ్యేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. కేంద్ర పథకాలకు సంబంధించి …

Read More »

ధాన్యం కొనుగోళ్లలో చారిత్రాత్మక మైలురాయి చేరాం

-రూ.8003 కోట్ల మేర ధాన్యం కొనుగోలు చేయడం ఓ రికార్డు -వైసీపీ పాలన చీకటి రోజుల నుంచి అన్నదాతను బయటకు తెస్తున్నాం -ఖరీఫ్ స్ఫూర్తితో రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు సిద్ధం -తేమ శాతం సమస్యలు, తూకం సమస్యలు, గోతాముల కొరత, రవాణా ఇబ్బందులు లేకుండా చూస్తాం -గుంటూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే 746 శాతం అధికంగా ధాన్యం కొనుగోళ్లు -వచ్చే విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం -రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుంది -తెనాలిలో …

Read More »

ప్రజలకు ఆర్థిక స్థిరత్వ కల్పన కూటమి ప్రభుత్వ లక్ష్యం

-రాష్ట్ర అభివృద్ధిపై సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం -ఉపాధి హామీ పనులతో అన్నదాతల కళ్లలో వెలుగు చూడాలి -గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది -కూటమి ప్రభుత్వం వ్యవస్థలను పటిష్టపరుస్తూ ముందుకు వెళ్తోంది -త్వరలో జిల్లాల్లో పర్యటనకు ప్రణాళికలు -కొణిదెల గ్రామంలో అభివృద్ధి పనులకు సొంత ట్రస్ట్ నుంచి రూ. 50 లక్షల నిధులు -కర్నూలు జిల్లా, పుడిచర్లలో ఫామ్ పాండ్స్ నిర్మాణానికి భూమి పూజ చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  -రాష్ట్రవ్యాప్తంగా లక్షా 55 వేల ఫామ్ …

Read More »

ప్రసూతి మరణాల్ని తగ్గించడంలో ప్రగతిని సాధించాం

-సురక్షిత ప్రసవాల కోసం వైద్య సౌకర్యాల్ని బలోపేతం చేస్తున్నాం -2030 నాటికి ప్రసూతి మరణాల రేటును 70 కన్నా తక్కువ సాధించాలన్నదే లక్ష్యం -సామాజిక మాధ్యమం X లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్వీట్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు కార్యక్రమాల ద్వారా ఏపీలో ప్రసూతి మరణాలను తగ్గించటంలో గణనీయమైన ప్రగతి సాధించగలిగామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్వీట్ చేశారు. ప్రసూతి …

Read More »

అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటనను ఖండించిన సీఎం

-ఘటనపై డీజీపీతో సమీక్ష…కఠిన చర్యలకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా, గోపాలపురం నియోజకవర్గం, నల్లజర్ల మండలం, దూబచర్లగాంధీ కాలనీలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటనను సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు. భారతరత్న అంబేద్కర్‌ను అగౌరవపరిచేలా విగ్రహం పట్ల దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఘటనపై డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి…కుట్రతో ఇటువంటి నేరాలకు పాల్పడతున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు, ఆయా వర్గాల మనోభావాలు …

Read More »