Breaking News

Daily Archives: March 3, 2025

రాయనపాడు రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిని చేపట్టిన దక్షిణ మధ్య రైల్వే

-అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 12.13 కోట్లవ్యయంతో రాయనపాడు రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిని చేపట్టిన దక్షిణ మధ్య రైల్వే విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే దార్శనికతతో, భారతీయ రైల్వేలు రైల్వే స్టేషన్లను భారీ స్థాయిలో పునారభివృద్ధి చేయడం ద్వారా ఒక పెద్ద పరివర్తనను చేపడుతున్నాయి. “అమృత్ భారత్ స్టేషన్ పథకం” (ఏ. బి. ఎస్. ఎస్. ) కింద, దక్షిణ మధ్య రైల్వే సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 53 రైల్వే స్టేషన్లను రూ. 2,611 …

Read More »

తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్

-ఏర్పాటు చేసిన హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ -ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్ధ్యం -వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలోని రాక్‌మ్యాన్ ఇండస్ట్రీస్‌లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని నివాసం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్… పారిశ్రామిక అవరసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్‌కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. …

Read More »

డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త రాష్ట్రంగా మారాలి

-ప్ర‌జ‌ల్లో డిజిట‌ల్ అక్ష‌రాత‌స్య పెంపొందించాలి -వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ స‌మ‌ర్థంగా ఉప‌యోగించుకునేలా చేయాలి -ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ వాట్సాప్‌లోనే పొందేలా చూడాలి -దీని ఉప‌యోగిత‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాలి -జిల్లా క‌లెక్ట‌ర్లు ఈ బాధ్య‌త తీసుకోవాలి -అధికారుల‌కు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశం -ఈ నెలాఖ‌రుకు వాట్సాప్‌లో 300 ర‌కాల సేవ‌లందిస్తామ‌న్న అధికారులు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్ర‌తి పౌరుడూ డిజిట‌ల్ అక్ష‌రాస్యుడిగా మారాలి, త‌ద్వారా రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త క‌లిగిన రాష్ట్రంగా తీర్చి దిద్దాల‌ని, ఆ దిశ‌గా అధికారులు …

Read More »

సర్కులర్ ఎకానమీ ఫోరం సదస్సు లో ఒప్పందం….

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ ఆధారిత సంస్కరణలు, జాతీయ స్థాయిలో బలోపేతం పై కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాజస్థాన్ లోని జైపూర్ లో జరుగుతున్న 12 వ ఆసియా పసిఫిక్ ఉన్నతస్థాయి ప్రాంతీయ 3R (రెడ్యూస్,రీ యూజ్,రీ సైకిల్) సర్కులర్ ఎకానమీ ఫోరం సదస్సు లో ఈ ఒప్పందం జరిగింది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సుకు పలు దేశాల ప్రతినిధులతో పాటు ఏపీ …

Read More »

వ్యవసాయ ఎగుమతులను పెంచేందుకు APMARKFED & NCEL మద్య ఒప్పందం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం నుండి వ్యవసాయ ఎగుమతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (APMARKFED) మరియు న్యూడిల్లీకి చెందిన నేషనల్ కో-ఆపరేటివ్ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (NCEL) మద్య వ్యూహాత్మకమైన అవగాహన ఒప్పందం (MOU) జరిగింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో శ్రీ బుడితి రాజశేఖర్‌, ఐఏఎస్‌., ఎక్స్‌-ఆఫీసియో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, వ్యవసాయం, వ్యవసాయం) మరియు కర్రోతు బంగార్రాజు, చైర్మన్‌, ఏపి, మార్క్‌ఫెడ్‌ సమక్షంలో APMARKFED …

Read More »

భ‌వ‌న నిర్మాణ‌దారుల‌కు ఏపీ ప్రభుత్వం శుభ‌వార్త

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భ‌వ‌న నిర్మాణ‌దారుల‌కు ఏపీ ప్రభుత్వం శుభ‌వార్త చెప్పింది. ఇక‌పై 18 మీట‌ర్ల లోపు లేదా ఐదంత‌స్తుల లోపు భ‌వ‌నాల నిర్మాణాల‌ అనుమతులకు స్వీయ ధృవీక‌ర‌ణ ప‌త్రం ఇస్తే స‌రిపోతుంది. టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి ఎలాంటి అనుమ‌తి అవ‌స‌రం లేకుండానే భ‌వ‌న నిర్మాణాల‌కు ప‌ర్మిష‌న్ వ‌చ్చేస్తుంది. కాక‌పోతే భ‌వ‌న య‌జ‌మానులు రిజిస్ట‌ర్డ్ ఎల్ టీపీలు,ఇంజినీర్లు లేదా ఆర్కిటెక్ట్ ల స‌మ‌క్షంలో స‌రైన ప‌త్రాలు స‌మ‌ర్పించి స్వీయ ధృవీక‌రణ (అఫిడ‌విట్) ఇవ్వాల్సి ఉంటుంది…దీనికి సంబంధించి గ‌త నెల‌లోనే భ‌వ‌న …

Read More »

పేదలందరికీ ఇళ్ల పట్టాలు

-ఇప్పటికి 70 వేల దరఖాస్తులు -జగనన్న ఇళ్ల పథకంలో అవకతవకలను నిగ్గు తేలుస్తాం -శాసనమండలిలో రాష్ర్ట రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదలందరికీ ఇళ్ల పథకం కింద రాష్ర్టంలో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు రాష్ర్ట రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి పేద వాడికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇళ్లు ఉండాలనేది టీడీపీ విధానమని, అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం పేదలకు గ్రామీణ ప్రాంతంలో మూడు …

Read More »

బార్బీక్యూలో మటన్ ప్రియులకు ప్రత్యేక ఉత్సవం

– మటన్ రుచుల విందు ‘లజీజ్-ఈ-గోశ్త్’ – ఈ ఫెస్టివల్ మార్చి 3 నుంచి ఏప్రిల్ 6 వరకు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మటన్ ప్రియుల జిహ్వ చాపల్యాన్ని తీర్చేందుకు బార్బీక్యూ నేషన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ‘లజీజ్-ఈ-గోశ్త్’ పేరుతో ఫుడ్ ఫెస్టివల్‌ ప్రారంభించామని బార్బీక్యూ నేషన్ హాస్పిటాలిటీ లిమిటెడ్ సీడీవో మాన్సూర్ మెమోన్, ఆంధ్ర హెడ్ నరేష్ నాయుడు తెలిపారు. సోమవారం విజయవాడ బందరు రోడ్డులోని ఎల్ఈపీఎల్ సెంట్రల్ మాల్ లోని బర్భిక్యూ నేషన్ లో మీడియా సమావేశం జరిగింది. …

Read More »

నగరంలో ఘనంగా అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ జయంతి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో టెలీఫోన్‌ సృష్టికర్త, ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం చుట్టుగుంట, బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం ప్రాంగణంలోని అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ విగ్రహం ముందు ఆయన జయంతి వేడుకలు విగ్రహ నిర్మాత మాజీ జెటిఓ నరాలశెట్టి రామమోహనరావు, సతీమణి మాజీ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ నరాలశెట్టి నిర్మల ఆధ్వర్యంలో అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిధిగా చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం, …

Read More »

AP ఛాంబర్స్ ఆఫీస్ బేరర్‌లను కలిసిన న్యూ ఢిల్లీలోని కెనడా హైకమిషన్ నుండి మంత్రి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూ ఢిల్లీలోని కెనడా హైకమిషన్ నుండి మంత్రి (వాణిజ్య వ్యవహారాలు) AP ఛాంబర్స్ ఆఫీస్ బేరర్‌లను కలిసారు. మంత్రి (వాణిజ్య వ్యవహారాలు), న్యూఢిల్లీలోని కెనడా హైకమిషన్, ర్యాన్ ఎ. వార్డ్‌తో పాటు హైదరాబాద్‌లోని కెనడా ట్రేడ్ కమీషనర్, విక్రమ్ జైన్, ఎపి ఛాంబర్స్ ఆఫీస్ బేరర్‌లతో ఈరోజు విజయవాడలో సమావేశమయ్యారు. కెనడా, ఆంధ్రప్రదేశ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకోవడంపై చర్చించారు. మిస్టర్ ర్యాన్వార్డ్ కెనడాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంపెనీలకు ఉన్న అవకాశాల గురించి మరియు కెనడియన్ …

Read More »