Breaking News

Monthly Archives: April 2025

జాతీయ,అంతర్ రాష్ట్ర ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయండి:ప్రధాని మంత్రి నరేంద్ర మోడి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ జాతీయ,అంతర్ రాష్ట్ర ప్రాజెక్టులను సకాలంలో వేగవంతంగా పూర్తి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు.ప్రధాన మంత్రి మాతృ వందన యోజన ఫిర్యాదుల పరిష్కారం, తుంకూర్-రాయదుర్గ వయా కళ్యాణదుర్గ నూతన రైల్వే లైను ప్రాజెక్టు,ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం అమలు తదితర ప్రగతి అంశాలపై బుధవారం ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ వివిధ …

Read More »

శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు

-అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి శుభాకాంక్షలు -రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని , రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. ఆలు పెరగకుండా శ్రమిస్తున్న కార్మికులందరికీ ‘మే డే’ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని అన్నారు. రాష్ట్ర …

Read More »

మే డే సందర్భంగా 11 ఎంఎస్ఎంఈ పార్కులు, 1 ఎఫ్ఎఫ్‌సీ ప్రారంభం

-మరో 14 ఎఫ్ఎఫ్‌సీలు, 25 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన -నెల్లూరు జిల్లా నారంపేటలో శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు -175 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పాలనేది సంకల్పం -2028 కల్లా 15,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు, 2 లక్షల ఉద్యోగాల సాధన లక్ష్యం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. పెద్దఎత్తున రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా…. ఇంటికో ఎంట్రపెన్యూర్‌ని తయారు చేసేలా నియోజకవర్గానికి …

Read More »

సింహాచలం దుర్ఝటన పై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి

-72 గంటల్లో నివేదిక అందజేయాలంటూ ముగ్గురు ఉన్నత స్థాయి అధికారులతో విచారణ కమిషన్ -దుర్ఝటనలో మరణించిన వారికి రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల నష్టపరిహారం -బాదిత కుటుంబాలకు చెందిన వారికి ఔట్ సోర్సింగ్ పై ఉద్యోగాలు -రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి అందరూ ఆహ్వనితులే -సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృశింహ స్వామి వారి చంధనోత్స వేడుకల సందర్బంగా క్యూలైన్లో …

Read More »

ఆర్డీటీ సమస్య పరిష్కారంపై సీఎంకు ఉమ్మడి అనంత జిల్లా ఎమ్మెల్యేల వినతి

-ఎఫ్‌సీఆర్ఏ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరిన ఎమ్మెల్యేలు -కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని సీఎం హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వివిధ గ్రామీణ ప్రాంతాలకు సేవలందిస్తున్న ఆర్డీటీకి విదేశాల నుంచి వచ్చే నిధుల వినియోగానికి సంబంధించిన ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్‌ను కేంద్రం నిలిపేసిందని, దీని పునరుద్ధరణకు చొరవ తీసుకోవాలని ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, బండారు శ్రావణి అలిమినేని సురేంద్రబాబు, దగ్గపాటి వెంకటేశ్వరప్రసాద్ సీఎంను సచివాలయంలో …

Read More »

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు ఆల్ ది బెస్ట్ తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆల్ ది బెస్ట్ తెలిపారు. బుధవారం ఉండవల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన మంత్రి కందుల దుర్గేష్ అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన వియత్నాం పర్యటన వివరాలను సీఎం చంద్రబాబుకు వివరించారు. వియత్నాం పర్యటన నేపథ్యంలో బుధవారం సాయంత్రం న్యూఢిల్లీ బయలుదేరుతున్నానని తెలిపారు. మే 1 వ తేదీ నుండి మే 6వ తేదీ వరకు వియత్నాంలో జరిగే బుద్ద భగవానుని అవశేషాల …

Read More »

సింహాచలంలో గోడకూలి ఏడుగురు భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

-మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి -ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ -క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలు అందించాల్సిందిగా ఆదేశం -గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణ -మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.3 లక్షల సాయం -మృతుల కుటుంబాల్లో ఒకరికి దేవాదాయ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం -బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్న ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో గోడకూలి ఏడుగురు భక్తులు మృతి చెందడంపై …

Read More »

యానాంలో జిప్‌మెర్ సూప‌ర్ స్పెషాలిటీ సెంట‌ర్ ను న‌డిపేందుకు రాష్ట్ర సాయం

-రాష్ట్ర ప్ర‌భుత్వ వైద్యుల‌కు, ప‌రిస‌ర ప్రాంతాల తెలుగు ప్ర‌జ‌ల‌కు చేకూర‌నున్న‌ప్ర‌యోజ‌నం -జిప్‌మెర్ విజ్ఞ‌ప్తికి మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అంగీకారం అమ‌రావ‌తి,  నేటి పత్రిక ప్రజావార్త : యానాంలో జిప్‌మెర్ సూప‌ర్ స్పెషాలిటీ సేవ‌ల్ని అందించ‌డానికి అవ‌స‌ర‌మైన సాయాన్ని స‌మ‌కూర్చటానికి రాష్ట్ర వైద్య‌,ఆరోగ్య శాఖా మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ అంగీక‌రించారు. కేంద్ర పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరి ( పాండిచ్చేరి)లో భాగ‌మైన యానాంలో ప్ర‌ఖ్యాత జిప్‌మెర్( జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్‌) నిర్మించిన 100 ప‌డ‌క‌ల సూప‌ర్ …

Read More »

ప్రధాని సభ ఏర్పాట్లను మంత్రి సవిత పరిశీలన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్రమోడి రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభానికి వస్తున్న సందర్బంగా ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పరిశీలించారు. బుధవారం రాష్ట్ర ఆర్యవైర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్ తో కలిసి ఆమె…ప్రధాని సహా ముఖ్య అతిథులు ఆశీనులయ్యే వేదికతో పాటు సభికుల కోసం ఏర్పాటు చేస్తున్న ప్రాంగణాన్ని పరిశీలించారు. పనులు ఎంతమేరకు జరిగాయని నిర్వాహాకులను అడిగి తెలుసుకున్నారు. అయిదు లక్షలకు పైగా …

Read More »

ఆర్యవైశ్యుల అభివృద్ధే సీఎం చంద్రబాబు లక్ష్యం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఆర్యవైశ్యుల అభివృద్ధే సీఎం చంద్రబాబునాయుడి లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. బుధవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను రాష్ట్ర ఆర్య వైశ్యుల కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్ సహా పలువురు డైరెక్టర్లు కలిసి, వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ఆర్థికంగా, రాజకీయంగా కూడా పెద్దపీట వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యుల …

Read More »