Breaking News

Monthly Archives: April 2025

నీట్‌ పరీక్షకు పకడ్బందీగా పూర్తి ఏర్పాట్లు

-జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మే 4న నీట్ యూజీ- 2025 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవిన్యూ అధికారి జి నరసింహులు సంబందిత అధికారులకు సూచించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫిరెన్స్ హాలు లో నీట్‌ యూజీ- 2025 పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ నీట్ సిటీ కోఆర్డినేటర్ హేమంత్ పాండ్య, జిల్లా అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి లతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

ఒకటవ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ కి సర్వం సిద్ధం… : జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్

-ఏప్రిల్ నెలకు సంబంధించిన 2,61,230 మంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు సూమారు 111.84 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు మే నెల, 2025 ఒకటవ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ కి సర్వం సిద్ధం జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ నెలకు సంబంధించిన 2,61,230 మంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు సూమారు 111.84 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా సామాజిక …

Read More »

అప్పన్న భక్తుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింహాచలం క్షేత్రంలో చోటుచేసుకున్న ఘటన అత్యంత బాధాకరమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. తిరుమల తొక్కిసలాట ఘటన మరువకముందే అప్పన్న సన్నిధిలో గోడ కూలి ఏడు నిండు ప్రాణాలు బలికావటం కలచివేసిందన్నారు. మృతులలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటం అత్యంత బాధాకరమన్నారు. కూటమి సర్కారుకి దేవుడంటే భయం, భక్తి ఏమీ లేదని.. కనుకనే ఆలయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం …

Read More »

నా స్థలమును నాకు ఇప్పించండి – షేక్ జలీల్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : తన స్థలమును తనకు ఇప్పించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ జలీల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన గాంధీనగర్ ప్రెస్ నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లా నల్లపాడు లో తనకు 250 చదరపు గజాల స్థలం ఉందని అందులో 70 చ.గ లో రూములు, 150 చ.గ లలో ఖాళీ స్థలం తన స్వాధీనంలో ఉందని తెలిపారు. తనకు అవసరం …

Read More »

ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరిన్ని పథకాలు సాధిస్తా…

-ఆసియా యోగా స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌ గోల్డ్ మెడలిస్ట్ శిరీష విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆసియా యోగా స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌ గోల్డ్ మెడలిస్ట్ పోటీలలో మన దేశానికి తన ద్వార గోల్డ్ మెడల్ రావటం ఎంతో గర్వకారణంగా ఉందని ఆసియా యోగా స్పోర్ట్స్ ఛాంపియన్ బి. శిరీష వెల్లడించారు. యోగాలో Msc, (M Phil) వరకు పూర్తి చేశాను. వివిధ కళాశాలలో విద్యాసంస్థలో పనిచేస్తూ యోగ పోటీలో పాల్గొంటున్నానని, యోగాలో 18 సంవత్సరాల అనుభవం ఉందని ప్రభుత్వం ప్రోత్సహిస్తే దేశానికి మరిన్ని పథకాలు …

Read More »

ఎలాంటి ఇబ్బందులు లేకుండా పీఎం ప‌ర్య‌ట‌న‌కు ఏర్పాట్లు

-ప‌టిష్ట స‌మ‌న్వ‌యంతో కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేద్దాం -రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, స‌హ‌కారం, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 2న అమరావతి రాజ‌ధాని పునః ప్రారంభ పనుల శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు గౌర‌వ ప్ర‌ధాన‌మంత్రి రానున్న నేప‌థ్యంలో అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల ప‌టిష్ట స‌మ‌న్వ‌యంతో కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకారం, మార్కెటింగ్, పశుసంరక్షణ, డెయిరీ డెవలప్‌మెంట్‌, మ‌త్స్య శాఖామంత్రివ‌ర్యులు కింజ‌రాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధ‌వారం జిల్లా క‌లెక్ట‌రేట్‌లో మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ కేశినేని శివ‌నాథ్ …

Read More »

“జాబ్ మేళా”

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను బుధవారం ఉయ్యూరు లోని “A.G & S.G Siddhartha Degree College of Arts & Science” నందు “జాబ్ మేళా” నిర్వహించినట్లు ఉపాధి అధికారి/డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డి. విక్టర్ బాబు, APSSDC సంస్థ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి dr పి.నరేష్ కుమార్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ Dr. M.శివనాధ్ సంయుక్తంగా తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో, ఎమ్ఎస్ఎన్ …

Read More »

ఆడపిల్లలు చదువులో రాణించాలి

-విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆడపిల్లలు చదువులో ముందంజలో ఉండాలి అని విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. విజయవాడ, కస్తూరిబాయిపేట , నవోదయ పబ్లిక్ స్కూల్ విద్యార్థి కొల్లి స్వాతి SSC 2025 సంవత్సరం పబ్లిక్ పరీక్షలలో NTR డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన కొల్లి స్వాతిని నగర ప్రథమ పౌరురాలు, విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ద్వారా న 5116/- నగదును మరియు …

Read More »

నగర పరిశుభ్రతపై రాజీలేదు – విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

-నగర పరిశుభ్రత పై రాజీ పడేది లేదని విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ రోడ్, రామవరప్పాడు రింగ్, నేషనల్ హైవే ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, సంబంధిత అధికారులు ప్రతి రోజు సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధాన రహదారులు, జంక్షన్లు, మార్కెట్ ప్రాంతాల్లో …

Read More »

అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి R.S. బ్రదర్స్ మాల్,సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఏలూరు రోడ్, V9 cloth షోరూమ్, లెనిన్ సెంటర్ మరియు చందనా బ్రదర్స్ షో రూమ్ లను ఆకస్మిక తనిఖీ చేసారు వి యం సి సిబ్బంది. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను …

Read More »