రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గండేపల్లి మండల ఎంపీడీవోగా, అనంతరం ఏలూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (DWMA)లో డిఎల్డిఓగా పదోన్నతి పొందిన శ్రీమతి నాతి బుజ్జి సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా సోమవారం పదవిని బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకం డిప్యూటేషన్ ఆధారంగా జరిగిందని, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. శివ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు, హౌసింగ్ శాఖ సిబ్బంది శ్రీమతి నాతి బుజ్జి గారిని అభినందించారు. ఇప్పటి వరకు హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా కే ఆర్ సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కే భాస్కర్ రెడ్డి బాధ్యతలు నిర్వహించడం జరిగింది.
Prajavartha Online Telugu News