Breaking News

వెంకటాయపాలెం గ్రామంలోని మునిగిన పొలాలను ఆర్డీవో రాణి సుస్మిత పరిశీలన

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం సాయంత్రం కొవ్వూరు ఆర్డీవో శ రాణి సుస్మిత గోపాలపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో తుఫాను కారణంగా మునిగిన వ్యవసాయ పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆమె, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయం అందిస్తుందని వారికి భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పంట నష్టాలను అంచనా వేయడం జరుగుతోందని ఆర్డీవో తెలిపారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టపరిహారం కోసం అవసరమైన నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించబడతాయని పేర్కొన్నారు. సందర్శనలో వ్యవసాయ శాఖ అధికారులు, తహసిల్దార్, సిబ్బంది మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *