రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో గురువారం 9వ అదనపు జిల్లా జడ్జి ఎమ్. మాధురి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్రీ లక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార ప్యానల్ న్యాయవాదులు, డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ కేసులలో ఉచిత న్యాయ సహాయం అందించేందుకు నియమించబడిన న్యాయవాదులతో ఆయా కేసుల పురోగతిని సమీక్షించారు. కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని, సంబంధిత సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే వెంటనే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే క్రిమినల్ కేసులకు సంబంధించిన బెయిల్ అర్జీల స్థితిగతులపై కూడా సమగ్రంగా వివరాలు తెలుసుకున్నారు.
Prajavartha Online Telugu News