విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థకు నూతనంగా చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్గా నియమితులైన డాక్టర్ నిర్మల గౌరీ గురువారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో కమిషనర్ ధ్యానచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర డాక్టర్ నిర్మల గౌరీకి శుభాకాంక్షలు తెలియజేసి, నగర ప్రజలకు మెరుగైన వైద్య, ప్రజారోగ్య సేవలు అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Prajavartha Online Telugu News