ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఇబ్రహీంపట్నం సెయింట్ జేవియర్ విద్యార్థులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి తల్లిదండ్రులను , ఉపాధ్యాయులను,ఉత్సాహ పరిచారు. ప్రిన్సిపాల్ గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో చిన్ని చిన్ని కృష్ణులు ఉట్టికొట్టి ఉత్సాహ పరిచారు. పూర్వికులు ఆనవాయితీగా ఆచరించే పండుగలతోనే ఆత్మీయత, ఆనందమని అన్నారు., చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉట్టికొట్టడం, కోలాటం, మ్యూజికల్ నైట్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News