-నగరపాలక సంస్థ కాంట్రాక్టర్లకు సూచించిన – జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఐ.ఏ.ఎస్.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు ఏ.పి పట్టణ మౌలిక వసతుల సముదాయాల సంస్థ (టిడ్కో) అధ్వర్యంలో చేపడుతున్న గృహ నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టర్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఐ.ఏ.ఎస్, నగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) శ్రీవాస్ నుపుర్ అజయ్ కుమార్, ఐ.ఏ.ఎస్, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) డా.జె. అరుణ, పి.డి హౌసింగ్ రామచంద్రన్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీ నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు పథకమునకు సంబందించి జగనన్న కాలనీ ప్రక్రియ వేగవంతము చేయుటకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా లేఅవుట్ ప్రకారం జియో టాగింగ్, మ్యాపింగ్ చేసి నగరపాలక సంస్థ పరిధిలోని 33 వేల గృహ గ్రౌండ్ చేయునట్లుగా చర్యలు చేపట్టి నెలాఖరు నాటికీ పూర్తి చేయాలని చేయాలని అన్నారు.
పై సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ.ఎస్.ఎన్ ప్రసాద్, టిడ్కో హౌసింగ్ అధికారులు, నగరపాలక సంస్థ కాంట్రాక్టర్లు, యు.సి.డి సిబ్బంది మరియు సచివాలయ ప్లానింగ్ ఎనిమిటి సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.