Breaking News

గ్రానైట్ వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తాం- రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి నేతృత్వంలోని గ్రానైట్ వ్యాపారుల బృందం నేడు సచివాలయంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కార్యాలయంలో కలిసి గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలపై విన్నవించారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపు, రాయల్టీ ఫీజు, సహా వివిధ రకాల పన్నులను తగ్గించాలని లేదంటే రాష్ట్రంలో ఈ రంగం మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని మంత్రికి విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను యం యస్ యం ఈ మంత్రి హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేబినెట్ సహచరుల దృష్టికి తీసుకువెళ్ళి తమను ఆదుకోవాలని వారు కోరారు. వారి సమస్యలను సావధానంగా విన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గ్రానైట్ వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, ఈ విషయాన్ని క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్ళి గ్రానైట్ వ్యాపారుల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *