రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే సూచనల కారణంగా మరియు పరిస్థితిని పర్యవేక్షించడానికి హెడ్క్వార్టర్స్లో అధికారులు అందుబాటులో ఉండటం చాలా అవసరం అని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటన లో తెలియచేశారు. 09.05.2022న రెవెన్యూ డివిజనల్ అధికారి కొవ్వూరు లో చేపట్టిన నియోజకవర్గ స్థాయి వద్ద స్పందనను రద్దు చేయాలని నిర్ణయించడం జరిగింది. కావున జిల్లా అధికారులందరూ యథావిధిగా ఎన్ ఎ సి కలెక్టర్ కార్యాలయం బొమ్మూరులో ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు స్పనదనకు హాజరుకావాలన్నారు. కలెక్టరేట్ కార్యాలయానికి ఎప్పటిలాగే చేరుకోవడానికి ప్రజలకు ఉచిత బస్సులను ఏర్పాటు చేయాలని జిల్లా రవాణా అధికారిని కలెక్టర్ ఆదేశించారు.
Prajavartha Online Telugu News