విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
46 సంవత్సరాల తరువాత 1976 సం॥ బ్యాచ్ సత్యనారాయణపురం, రైల్వే మిక్సెడ్ హైస్కూల్, తెలుగు మీడియం, 10వ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక జరిగింది. ఎస్.మల్లిక్, సుకుమార్, టి.వేణుగోపాల్, ఎం.వి.శ్రీనివాస్, ఎన్.సి.హెచ్.రంగనాథ్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ, గాంధీనగర్లోని ఐలాపురం హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలతో పాటు వివిధ ఇతర దేశాలలోను, వివిధ ప్రాంతాలలో స్థిరపడిన విద్యార్థులు అందరూ కుటుంబాలతో కలిసి 46 సంవత్సరాల తరువాత కలిసి గత స్మృతులను తలచుకొని, ఒకరికొకరు క్షేమ సమాచారాలు తెలుసుకుని ఆత్మీయ సమ్మేళనంలో ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్దులు, వారి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News