Breaking News

కృష్ణా గోదావరి బేసిన్ లో 50శాతం వాటా కేటాయించాలి

-జేడీఫ్ అధ్యక్షులు డాక్టర్ తరుణ్ కాకాని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా గోదావరి బేసిన్ లో ఉన్న సహజ వాయువు, చమురు నిక్షేపాల బాభాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 50శాతం వాటా కేటాయించాలని జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం (జేడీఫ్) అధ్యక్షులు డాక్టర్ తరుణ్ కాకాని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జేడీఫ్ ఆధ్వర్యంలో దగా వద్ద ఆంధ్రుడా మేలుకో నినాదంతో వివిధ పార్టీలు, ప్రజాసంఘాల తో రౌండ్ టేబుల్ సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తరుణ్ మాట్లాడుతూ 12వ ఆర్ధిక సంఘం సిఫార్సులను ఆచరణలో పెట్టాలని కోరారు. కార్పొరేట్ సంస్థల దోపిడీని అరికట్టి సగటు పాటు పారిశ్రామిక అభివృద్ధి జరిగి ఉద్యోగ ఆంధ్ర పౌరునికి రూ.100కే గ్యాస్ సిలిండర్ అవకాశాలు పెరగడం, సంపద సృష్టి అందజేయవచ్చన్నారు. రాష్ట్ర వాటా కింద జరుగుతుందని వివరించారు. సీపీఐ రాష్ట్ర వచ్చే ఆదాయంతో అప్పులను తీర్చడంతో ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో జేడీస్ ప్రధాన కార్యదర్శి మీడా క్రసవాన్ని కార్యదర్శి అవధానుల వారి, అదనపు కార్యదర్శి డాక్టర్ సేవా కుమార్, గౌరవ అధ్యక్షుడు పి సురేంద్ర రెడ్డి, లోక్ సత్తా గుంటూరు ప్రతినిధి సదాశివరావు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సేవ కుమార్, జై భీమ్ నేషనల్ పార్టీ నాయకులు శ్రీనివాసా చారి, ఆచార్య ఎన్జీ రంగా ట్రస్ట్ చైర్మన్ గోగినేని ధనశేఖర్, కాకాని ఆశయ సాధన కమిటీ సభ్యులు గుమ్మడి రామకృష్ణ కోనేరు బసవేశ్వరావు, వేములపల్లి వెంకట రమణ, బాపట్లఐఐటి ప్రొఫెసర్ విజయ్ కుమార్ రామారావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *