Breaking News

కుశల ప్రశ్నలతో వృద్ధులకు పింఛన్లు అందజేసిన జిల్లా కలెక్టర్

పెడన, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఉదయం పెడనలో 16వ వార్డు మచిలీపట్నం రోడ్డు సచివాలయం పరిధిలో వృద్ధురాలు పిచ్చుక మల్లికాంబ గృహం సందర్శించి, ఆమె ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు అడిగి ఆమెకు 4000 రూపాయల వృద్ధాప్య పింఛను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో ఆగస్టు నెలకు 2,40,939 మంది లబ్ధిదారులకు రూ 102.16 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఇళ్ల వద్ద అందజేయుటకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకట్రామయ్య, మున్సిపల్ సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు .

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *