Breaking News

రాష్ట్రానికి శనిలా దాపురించారు

-ఐదేళ్లు రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చారు
-పదవి పోయాక నీతులు చెబుతూ డ్రామాలాడుతున్నారు
-గత ఐదేళ్ల పాలనలో జరిగిన హింసకు పేర్ని నాని సమాధానం చెప్పాలి
-వైసీపీ నేతలంతా కలిసి రాష్ట్ర మంతా పొర్లు దండాలు పెట్టినా ప్రజలు క్షమించరు
-గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వెయ్యి గొడ్లను తిన్న రాబందు నీతులు చెప్పినట్లుంది పేర్ని నాని మాటలు వింటుంటే. ఐదేళ్లు దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాల్లో పైశాచికానందం పొందిన వైసీపీ బ్యాచ్ ఇప్పుడు నీతులు చెబుతూ, రాజ్యాంగం గురించి, ప్రజల గురించి మాట్లాడుతున్నారు. తోట చంద్రయ్యను నడిరోడ్డుపై పీక కోసి చంపారు. అబ్దుల్ సలాం కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాస్కు అడిగిన డా.సుధాకర్‌ను నిరోడ్డుపై పెడరెక్కలు విరిచి కొట్టారు. మద్యం గురించి ప్రశ్నించిన విక్రమ్‌ను చంపారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న వరప్రసాద్‌కు గుండుకొట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఐదేళ్ల వైసీపీ పాలనంతా ప్రజకు క్షణమో గండంలా గడిచింది. న్యాయం చేయమన్న అమరావతి రైతులు, మహిళలపై దాడులు చేశారు. పల్నాడులో ఎన్నికల పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేతలు బొండా ఉమ, బుద్దా వెంకన్న, హైకోర్టు లాయర్‌ను చంపబోయారు. దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైకి గంజాయి ముఠాను పంపి దాడి చేశారు. ఐదేళ్లలో దాదాపు 2వేల మంది తెలుగుదేశం పార్టీ నేతల్ని అత్యంత కిరాతకంగా హత్య చేశారు.కూటమి అధికారంలోకి వచ్చాకే స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నాని ప్రజలు చెబుతుంటే.. వైసీపీ నేతలు భరించలేకపోతున్నారు. రోజుకో కుట్రతో కూటమి ప్రభుత్వంపై నిందలేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. తప్పు చేసిన అధికారుల్ని చట్టం ప్రకారమే శిక్షిస్తామని నారా లోకేశ్ ప్రకటించిన నాటి నుండి పేర్ని నాని లాంటి అరాచ శక్తుల గుండెల్లో వణుకు మొదలైంది. అందుకే రెడ్ బుక్ చూసి వణుకుతున్నారు. ఇప్పటికైనా పేర్ని నాని చేసిన తప్పులకు ప్రజల్ని క్షమాపణలు కోరితే మంచిది. ఇంకా నీతి లేని రాజకీయాలను నమ్ముకుంటే ప్రజలే తిరుగుబాటు చేస్తారని గుర్తుంచుకోవాలి

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *