Breaking News

నగర ప్రజలకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర ప్రజలకు వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ 78 ఏళ్ల కాలంలో దేశం ఎంతో పురోగతి సాధించిందని.. ఇంకా సాధించాల్సింది చాలా ఉందని చెప్పుకొచ్చారు. కొన్ని తరాల నిస్వార్థ త్యాగానికి నిదర్శనం మన స్వాతంత్ర పోరాటమని.. జాతీయ జెండాను ఎగురవేయడమంటే స్వేచ్చను అనుభవించడమేనని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య దినోత్సవం అనేది కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా జరుపుకునే పండుగ అని పేర్కొన్నారు. బ్రిటీష్‌ నిరంకుశత్వ పాలనకు ప్రతిఘటించి వారిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వారిలో ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు ముందు వరుసలో నిలిచారని తెలిపారు. జాతికే కేతనం ఇచ్చిన పింగళి వెంకయ్య, అయ్యదేవర నాగేశ్వరరావు, కాశీనాథుని నాగేశ్వరరావు.. ఇలా ఎందరో మహనీయులు స్వాతంత్ర్యోద్యమానికి ఊపిరి పోసి, దేశ దాస్య శృంఖలాలను తెంచడంలో ముఖ్యభూమిక పోషించారన్నారు. ఆ స్వాతంత్ర్య సమరయోధుల ఉద్యమ స్ఫూర్తితో దేశ ప్రగతికి ప్రజలందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *