Breaking News

అంగన్వాడి కేంద్రాలకు అవసరమైన కందిపప్పు సరఫరా టెండర్ కొరకు దరఖాస్తుల ఆహ్వానం

-జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా కొనుగోలు కమిటీ చైర్మన్ శుభం బన్సల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలోని 12 ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ లోని 2492 అంగన్వాడి కేంద్రాలకు అవసరమైన కందిపప్పు (1Kg ప్యాక్) సప్లమెంటరీ న్యూట్రీషన్ ప్రోగ్రామ్ ద్వారా సరఫరా చేయుటకు ఆసక్తి గల ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖ నందు రిజిష్టర్డ్ అయిన Millers/Wholesalers/Govt. Agencies వ్యాపారస్తులు నుండి టెండర్ కోరనైనది. టెండరు అమ్మకం ప్రారంభ తేది: 29.08.2024 ఉ:10గం. టెండరు అమ్మకం చివరి తేది: 04.09.2024 మ:1 గం. టెండరు దాఖలకు చివరి తేది: 04.09.2024 మ.1.30 గం. టెండర్ ఓపెనింగ్ తేది: 04.09.2024, 3.30 pm ఇతర వివరములకు జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారత అధికారి, తిరుపతి జిల్లా, 5 వ అంతస్తు , బి-బ్లాక్ , కొత్త కలెక్టరు వారి కార్యాలయ ప్రాంగణము తిరుపతి వారిని సంప్రదించగలరని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఛైర్మన్ జిల్లా కొనుగోలు కమిటీ, తిరుపతి శుభం బన్సల్ గారు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *