Breaking News

బాదితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ వర్షాలు వలన గుంటూరు నగరపాలక సంస్థ తూర్పునియోజకవర్గం పరిధిలో ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాలను ఆదివారం కేంద్ర గ్రామీణభివృద్ధి , కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ , నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహ్మద్ నసీర్ అహ్మద్ తో కలసి పరిశీలించారు. పాతగుంటూరులోని ఎల్బీ నగర్, ప్రగతి నగర్, సుద్దపల్లి డొంక, జూన్ షాహెద్ ప్రాంతాలలో పర్యటించారు. ప్రగతినగర్ , జూన్ షాహెద్ ప్రాంతాల్లో వర్షం నీటిలోనే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, శాసనసభ్యులు నసీర్ అహ్మద్, కమిషనర్ పులి శ్రీనివాసులు నడుచుకుంటూ వెళ్ళి వర్షం నీరు చేరిన ఇళ్ళను పరిశీలించి, స్థానికులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. బాదితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తామని భరోసా కల్పించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *