Breaking News

రైతు భరోసా చైతన్య యాత్రలు సద్వినియోగం చేసుకోండి : జెసి డా. మాధవిలత

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈ నెల 23వ తేదీ వరకు రైతు భరోసా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.కె. మాధవిలత చెప్పారు. శుక్రవారం మైలవరం రైతు భరోసా కేంద్రంలో నిర్వహించిన రైతు భరోసా చైతన్య యాత్ర కార్యక్రమంలో జెసి మాధవిలత పాల్గొన్నారు. తొలిత రైతు భరోసా కేంద్రాన్ని జెసి మాధవిలత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో సాగు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కర మార్గాలు తెలియజేసేందు ప్రభుత్వం ఈనెల 9 నుంచి 23 వరకు రైతు భరోసా చైతన్య యాత్రలు నిర్వహిస్తుందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ల్జాతుల ముంగిటకే వ్యవసాయ సేవలు అందించబడుతున్నాయన్నారు. రైతుల కోసం గ్రామాల్లోనే పెద్ద ఎత్తున
మౌలిక వసతులు కల్పిస్తున్నారన్నారు. వ్యవసాయనికి అవసరమైన విత్తనం మొదలు ఎరువులు, పురుగుమందులు, నాణ్యమైనవి రైతు భరోసా కేంద్రాల నుంచే సరఫరా చేస్తున్నారన్నారు. దీంతో రైతులు మండల, జిల్లా కేంద్రాలకు వెళ్ళే పనితప్పిందన్నారు. రైతు పండించిన పంటలను కూడా కనీస మద్దతు ధరకే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహాశీల్దార్ ఆర్.వి.వి రోహిణి దేవి, పలువురు వ్యవసాయ, తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *