మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉంటే వారి కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో మహిళల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం నగరంలోని చిలకలపూడి పాండురంగ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వస్థనారి స్వశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన …
Read More »Tag Archives: machilipatnam
కొబ్బరి నూనె, డిటర్జెంట్ సబ్బులు, చెప్పులు అప్రాన్ లు కలిగిన సంచులను పారిశుధ్య కార్మికులకు పంపిణీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తూ ప్రజలందరి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర ప్రశంసించారు. బుధవారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర మంత్రివర్యులు 6 లక్షల రూపాయల విలువచేసే కొబ్బరి నూనె, డిటర్జెంట్ సబ్బులు, చెప్పులు అప్రాన్ లు కలిగిన సంచులను పారిశుధ్య కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో రాష్ట్ర మంత్రివర్యులు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు చేసే సేవలు అమూల్యమని, ప్రజలందరూ ఆరోగ్యంగా …
Read More »మీకోసం అర్జీలను ఎప్పటికప్పుడు సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందుతున్న మీకోసం అర్జీలను ఎప్పటికప్పుడు సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు అధికారులకు సూచించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిఆర్ఓ, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, సర్వ శిక్ష ప్రాజెక్ట్ అధికారి కుమిదిని సింగ్ లతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక-మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజలను నుండి అర్జీలను స్వీకరించారు. తొలుత డిఆర్ఓ జిల్లా …
Read More »ఆక్వా రైతులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సాగు చేయడం అభినందనీయం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆక్వా రైతులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సాగు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ నందివాడ, బాపులపాడు మండలాల్లో పర్యటించి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆక్వా సాగు చేస్తున్న ఫిష్ ట్యాంకులను పరిశీలించారు. తొలుత జిల్లా కలెక్టర్ నందివాడ మండలం అరిపిరాల గ్రామం, అనంతరం బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో రైతు కుమార్ రాజు తాను స్వయంగా తయారు చేసుకున్న పరికరాలతో చేపలకు మేత వేసే వినూత్న పద్ధతిని జిల్లా …
Read More »మండలాల్లో పర్యటించి యూరియా స్థితిగతులపై ఆరా…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని రైతుల అవసరాన్ని బట్టి యూరియా పంపిణీ చేస్తామని ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ గుడ్లవల్లేరు, నందివాడ మండలాల్లో పర్యటించి యూరియా స్థితిగతులపై ఆరా తీశారు. తొలుత గుడ్లవల్లేరు మండల కేంద్రమైన గుడ్లవల్లేరు లో మన గ్రోమోర్ కేంద్రం కోరమాండల్ ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి యూరియా నిల్వ వివరాలను అడిగి తెలుసుకున్నారు. యూరియా …
Read More »ఈ నెల 15వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 15వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ …
Read More »వెంకటేశ్వర స్వామి ఆస్తులను పరిరక్షిస్తూ.. ఆదాయం పెంచేలా చర్యలు
– ఆస్తులపై ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు – దసరా, విజయవాడ ఉత్సవ్ కోసం మాత్రమే వినియోగం – భవిష్యత్తులోనూ ఆలయానికి ఆదాయం వచ్చేలా ప్రణాళికలు – స్వామివారి సమక్షంలోనే ఒప్పందం చేసుకోవడం హర్షణీయమన్న మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం గొడుగుపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి గొల్లపూడిలో ఉన్న ఆస్తులను పరిరక్షించడంతో పాటుగా, ఆలయానికి ఆదాయం సమకూర్చేలా ప్రణాళికలు రచిస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ మేరకు …
Read More »ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర రవాణా రహదారులు భవనాల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు
మచిలీపట్నం (గిలకలదిండి), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా రహదారులు భవనాల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు శనివారం మధ్యాహ్నం గిలకలదిండిలో రూపుదిద్దుకుంటున్న ఫిషింగ్ హార్బర్ ను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఏపీ మారిటైం బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్యతో కలిసి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ ప్రణాళికకు సంబంధించిన మ్యాపులను పరిశీలించి డ్రెడ్జింగ్, బ్రేక్ వాటర్, భవన నిర్మాణాలు, టెట్రాపాడ్స్ దిమ్మల ఏర్పాటు తదితర పనుల పురోగతి వివరాలను ఆయన సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. …
Read More »2026 అక్టోబర్ కల్లా మచిలీపట్నం పోర్టు సిద్ధం
-రాష్ట్ర రవాణా రహదారులు భవనాల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేసి 2026 అక్టోబర్ లో పోర్టు రవాణ కార్యకలాపాలు ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణ రహదారులు భవనాల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు పేర్కొన్నారు. శనివారం ఉదయం ఆయన అధికారులతో కలిసి మచిలీపట్నం పోర్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. నార్త్, సౌత్ బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్, బెర్తులు, …
Read More »ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి… : జడ్పీ చైర్ పర్సన్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేయాలని కృష్ణాజిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల జాయింట్ కలెక్టర్లు గీతాంజలి శర్మ, ఎస్ ఇలాక్కియా, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాసరావు, …
Read More »
Prajavartha Online Telugu News