-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి పెడన, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడంలో అంకితభావంతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి అధికారులకు సూచించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన తన సిబ్బందితో గురువారం పెడన పట్టణం 14వ వార్డులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (బంగ్లా స్కూల్), అదేవిధంగా బల్లిపర్రులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల, కళాశాల, పెడన మండల పరిషత్ …
Read More »Tag Archives: pedana
పెద్దల సభ గౌరవాన్ని కాపాడుకుందాం
– గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి నాశనమైంది – అభివృద్ధిని గాలికొదిలి బటన్ నొక్కుడుతో మాయ చేశారు – ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను దూరం చేశారు – తెలుగు వారు నెం.1 కావాలనే లక్ష్యంతో చంద్రబాబు శ్రమిస్తున్నారు – కూటమి అభ్యర్ధిని గెలిపించి అభివృద్ధికి తోడు నిలుద్దాం – పెడన నియోజకవర్గంలో శ్రీవాసవీ ఇంజనీరింగ్ టీచింగ్ స్టాఫ్తో సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర పెడన, నేటి పత్రిక ప్రజావార్త : చట్ట సభల గౌరవాన్ని, రాష్ట్ర అభివృద్ధిని కాపాడుకునేందుకు కూటమి అభ్యర్ధికి ఓటు వేసి …
Read More »డిజిటల్ మార్కెటింగ్ తో అధిక ఆదాయం
-సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన అవసరం – జిల్లా కలెక్టర్ పెడన నేటి పత్రిక ప్రజావార్త : ఈ కామర్స్ మార్కెటింగ్ తో చేనేత వస్త్రాలను విక్రయించడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చని, అందుకు తగిన రీతిలో ఆయా సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. బుధవారం జాతీయ చేనేత దినోత్సవమును పురస్కరించుకొని జిల్లా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని పోలవరపుపేట, శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవాంగ ప్రార్థన మందిరంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య …
Read More »కలంకారీ పరిశ్రమ అభివృద్ధికి కృషి…
పెడన, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి విజయవాడ వారు HCL foundation వారి సహకారంతో కలంకారీ క్లస్టర్ డెవలప్మెంట్ లో భాగంగా కళాకారులకు స్కిల్ డెవలప్మెంట్, ఉమెన్ ఎంటర్ ప్రీన్యూవర్షిప్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలు గత పది నెలలుగా చేస్తూ ఉన్నారు. ఈమధ్య కాలంలో కలంకారి పనిలో ముఖ్య ఘట్టమైన నీళ్లతీతలు విషయంలో ఇబ్బందులు బాగా ఎదుర్కొంటున్నారు. వేసవికాలంలో పెడన పరిసర ప్రాంతాలలో కాలువలలో నీరు లేకపోవడం, నీటి ఎద్దడి కారణంగా నీళ్ల తీతల కొరకు యనమలకుదురు పెద్దపులిపాక శ్రీకాకుళం …
Read More »ఆశాజీవి ఆలోచనలో పడ్డారు?
-రాజకీయాలు వదలను..! -పెడన అడ్డా ను వదలను..! -మాజీ డిప్యూటీ స్పీకర్, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తాను పెడన నియోజకవర్గం సీటు ఆశించానని, చంద్రబాబు సీటు కేటాయించకపోయేసరికి, మనస్థాపానికి గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యానని మాజీ డిప్యూటీ స్పీకర్, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. గురువారం వారి నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేదవ్యాస్ మాట్లాడుతూ 1967 నుండి తమ కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతోందని, గెలిచినా, ఓడిన ఒకప్పటి …
Read More »కాకర్లమూడి గ్రామ సచివాలయ పరిధిలో గడపగడపలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్
పెడన, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్యులు జోగి రమేష్ శుక్రవారం పెడన మండలం కాకర్లమూడి సచివాలయ పరిధిలో కాకర్లమూడి, కాకర్లమూడి పాలెంలలో పర్యటించి “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల క్రింద పొందిన లబ్ధి వివరించి, ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తు ఎంతో మంచి చేస్తున్న జగనన్నకు మద్దతు తెలపాలని మంత్రి కోరారు. కాకర్లమూడి గ్రామ సచివాలయ పరిధిలో 338 మందికి ప్రతి నెల ఒకటో తేదీన …
Read More »ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఎంతో మంచి చేస్తున్న జగనన్నను ప్రేమతో ఆదరించి మీ ఆశీస్సులు అందించండి మంత్రి జోగి రమేష్
పెడన , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్యులు జోగి రమేష్ శనివారం పెడన మండలం ముచ్చర్ల గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించి గ్రామంలో ఇంటింటికి వెళ్లి వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల క్రింద వారు పొందిన లబ్ధి వివరించి, నిరుపేదల కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తు ప్రేమతో ఎంతో మంచి చేస్తున్న జగనన్నకు మీ ఆశీస్సులు అందించాలని మంత్రి కోరారు.గ్రామాభివృద్ధికి జగనన్న ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు మంత్రి గ్రామస్తులకు వివరించారు. …
Read More »రాష్ట్రంలో ప్రతి గడపకు ప్రతిరోజు రక్షిత మంచినీరు అందించడం జగనన్న లక్ష్యం
-లక్షల కోట్ల విలువ చేసి ఆస్తికి యజమానులను చేసే బృహత్తర కార్యక్రమం స్వామిత్వ -మంత్రి జోగి రమేష్ పెడన , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి జోగి శనివారం పెడన మండలం పెనుమల్లి గ్రామంలో జల జీవన్ మిషన్ పథకం కింద రు.70 లక్షల వ్యయంతో 213 స్వచ్ఛమైన సురక్షితమైన మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసిన పథకాన్ని మంత్రి ప్రారంభోత్సవం గావించారుఅనంతరం పెనుమల్లి సచివాలయం వద్ద వైయస్సార్ జగనన్న శాశ్వత గృహక్కు భూ రక్ష పథకంలో భాగంగా స్వామిత్వ …
Read More »చర్చించిన విషయాలపై దృష్టి కేంద్రీకరించి సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలి !! మంత్రి జోగి రమేష్
పెడన, నేటి పత్రిక ప్రజావార్త : పెడన అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షా సమావేశాల్లో చర్చించిన ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం అందించేందుకు అధికారులు త్వరితగతిన పని చేయాలని పెడన శాసనసభ్యులు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అధికారుకు సూచించారు.మంగళవారం పెడన మార్కెట్ యార్డ్ సమావేశం మందిరంలో నియోజకవర్గ పరిధిలోని కృత్తివెన్ను బంటుమిల్లి పెడన గూడూరు మండలాల తో పాటు పెడన పట్టణానికి సంబంధించి పలు సమస్యలపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా పెడన శాసనసభ్యులు, రాష్ట్ర గృహ …
Read More »మహిళలు జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవాలి !!
– మంత్రి జోగి రమేష్ పెడన నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ సున్నా వడ్డీతో నిరుపేద మహిళలు వృత్తి వ్యాపారాల్లో మరింత అభివృద్ధి చేసుకుని జీవన ప్రమాణాలు మెరుగు పరుచుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.సోమవారం సాయంత్రం పెడన పట్టణంలోని బ్రహ్మపురంలోని దేవాంగ కళ్యాణ మండపంలో నియోజకవర్గ పరిధిలోని వైయస్సార్ కళ్యాణమస్తు – వైయస్సార్ షాదీ తోఫా పథకాల లబ్ధిదారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో లోక్ సభ సభార్డినెట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరితో …
Read More »
Prajavartha Online Telugu News