విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో మల్లిఖార్జున పేటలోని అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. మల్లికార్జున పేటలో నివాసం ఉంటున్న పుట్టపు సత్యనారాయణ కుటుంబం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఆయన నివాసం ఈనెల 25 వ తేదీ సోమవారం అగ్ని ప్రమాదానికి దగ్ధమైంది. తమకు సాయం అందించాలని ఎమ్మెల్యే సుజనా చౌదరిని వారు కొరగా తక్షణమే సాయం అందజేయాలని తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయ సిబ్బంది బుధవారం ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే సుజనా కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News