విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (యు.సి.డి) విభాగము ద్వారా టిడ్కో (TIDCO) ద్వారా నిర్మాణము చేయబడే 5,412 మంది లబ్ది దారులకు (365 చ.అ.లు మరియు 430 చ.అ.లు) రూ. 3.15 లక్షలు మరియు రూ. 3.65 లక్షలు చొప్పున మంజూరు కొరకు నగరములో గల 12 బ్యాంకులకు సంబంధించి 79 మంది బ్యాంకు మానేజర్లు కౌన్సిల్ హాలు నందు సమావేశమునకు హాజరైనారు. ఈ సమావేశమునకు నగరపాలక సంస్థ కమీషనర్ వి. ప్రసన్న వెంకటేష్ IAS, అదనపు కమీషనర్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ డా. జె. అరుణ, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామమోహనరావు, చిన్నోడు టిడ్కో ఇ.ఇ, డి.సి.ఓ ఆనందరావు, బ్యాంకు కో ఆర్డినేటర్స్, సి.డి.ఓ లు మరియు సి.ఓ లు హాజరైనారు.
Prajavartha Online Telugu News