Breaking News

సీఎం చంద్రబాబు గుండె చప్పుడు బీసీలు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట
-బీసీలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం
-గత ప్రభుత్వంలో బీసీలపై వేధింపులు
-కూటమి రాకతో బీసీలకు మంచి రోజులు
-బీసీ రక్షణ చట్టానికి తుదిరూపు తీసుకొస్తున్నాం : మంత్ర సవిత
-తాడేపల్లిలో రాష్ట్ర స్థాయి బీసీ సాధికార సమితి కన్వీనర్ల సమావేశం
-సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ అవార్డుపై మంత్రి సవిత హర్షం

తాడేపల్లి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం చంద్రబాబునాయుడు గుండె చప్పుడు బీసీలేనని, వారి అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీ రక్షణ చట్టానికి తుది రూపు ఇస్తున్నామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు డెడికేటెడ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో టీడీపీ బీసీ సాధికార సమితి కన్వీనర్లు, జోనల్ కో ఆర్డినేటర్లతో మంత్రి సవిత శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బీసీ అభ్యున్నతికి కోసం ఆనాడు అన్న ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభించారన్నారు. రాజ్యాధికారంలో, చట్టాల రూపకల్పనలో బీసీలకు భాగస్వామ్యం కల్పించారన్నారు. ఎందరో బీసీ రాజకీయ ఉద్దండులను టీడీపీ తీర్చిదిద్దిందన్నారు. అన్నగారి స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు బీసీలకు అన్నింటా ప్రాధాన్యమిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు గుండె చప్పుడు బీసీలన్నారు. బీసీల రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రాధాన్యత కల్పించడానికే బీసీ సాధికార సమితులను సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారన్నారు. ఈ సమావేశం ద్వారా ఆదరణ 3.0 పథకం అమలుపై సాధికార సమిత కన్వీనర్ల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలుసుకోనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.

గత ప్రభుత్వంలో బీసీలను అణగదొక్కారు

గత రాక్షస ప్రభుత్వంపై బీసీ సాధికార సమితులు అలుపెరగని పోరాటం చేశారని మంత్రి సవిత కొనియాడారు. ప్రాణాలు పోతున్నా భుజాన పెట్టుకున్న పసుపు జెండాను దించలేదన్నారు. బీసీ నేత తోట చంద్రయ్య, కాకినాడ జిల్లాలో లాలం బంగారయ్య తమ ప్రాణాలు పోయినా పసుపు జెండా వదల్లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా అడ్డుకున్న వైసీపీ రాక్షస మూకలను చూసి తొడగొట్టిన అంజిరెడ్డి తాత తెగువను మరిచిపోలేమన్నారు. గత ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి ప్రశ్నించిన పాపానికి బీసీలపై 26 వేలకు పైగా అక్రమ కేసులు బనాయించారన్నారు. దాడులు, హత్యలు చేశారని, బీసీల జీవనాధారాలను సైతం వదలకుండా ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ. 75,760 కోట్లకు పైగా నిధులను దారి మళ్లించారన్నారు. స్థానిక సంస్థల్లో 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 24 శాతానికి కుదించి… బీసీలను 16 వేలకు పైగా పదవులకు దూరం చేశారన్నారు. ఆదరణ పథకాన్ని నిలిపేసి… బీసీ కుల వృత్తులను నిర్వీర్యం చేశారన్నారు.

త్వరలో బీసీ రక్షణ చట్టానికి తుదిరూపు

సీఎం చంద్రబాబు రాకతోనే బీసీలకు పూర్వవైభవం వచ్చిందని మంత్రి సవిత తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామన్నారు. బీసీ రక్షణ చట్టానికి తుది రూపు ఇస్తున్నామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా మాజీ ఐఎఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏక సభ్య డెడికేటెడ్ కమిటీని నియమించామని వెల్లడించారు. చట్ట సభల్లోనూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపామని తెలిపారు. టీడీపీలోనే కార్యకర్తకు గౌరవం దక్కుతోందన్నారు. కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చూసుకుంటున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా గతంలో ఎన్నడూ అమలు చేయాలని పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పసుపు జెండా రెపరెపలాడాలని మంత్రి సవిత దిశానిర్దేశం చేశారు. అనంతరం బీసీ సాధికార సమితి కన్వీనర్లను, జోనల్ కో ఆర్డినేటర్లను మంత్రి సవిత సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, మల్లె ఈశ్వరరావు, పేరేపి ఈశ్వర్, కె.సత్తిబాబు, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సీఎం చంద్రబాబుకు అభినందనలు

అంతకుముందు ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో పాటు ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు’ వంటి విధానాలను అమలు చేస్తూ, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో సీఎం చంద్రబాబు చూపుతున్న చొరవను కొనియాడుతూ ఎకనమిక్ టైమ్స్ మీడియా సంస్థ బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందజేయడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా దక్షతకు ఈ అవార్డే నిదర్శనమన్నారు. సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ అవార్డు ప్రకటించిన ఎకనామిక్స్ టైమ్స్ సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవార్డు రాష్ట్రానికి గర్వకారణమన్నారు. సీబీఎన్ ఇమేజ్ తోనే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, హర్టీకల్చర్ వంటి రంగాల్లో ఏపీని గ్లోబల్ హబ్‌గా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారన్నారు. విజన్ 2020తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసిన చంద్రబాబు, నేడు 2047తో నవ్యాంధ్రను దేశంలో అగ్రగామిగా నిలబెట్టడానికి రేయింబవళ్లు కృషి చేస్తున్నారని సీఎం చంద్రబాబును మంత్రి సవిత కొనియాడారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *