Breaking News

మల్లన్నను దర్శించుకున్న ఏపీ హైకోర్టు సీజే

శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జునుడిని ఆదివారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధానన్యామూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా దంపతులు దర్శించుకున్నారు. శనివారం రాత్రి సీజే దంపతులు శ్రీశైలానికి వచ్చారు. ఆదివారం తెల్లవారుజామున స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారికి వేదపండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కలెక్టర్‌ కోటేశ్వరరావు, ఈవో లవన్న వారికి స్వామివారి శేష వస్త్రాలను, ప్రసాదాలను, స్వామిఅమ్మవార్ల జ్ఞాపికను అందజేశారు. తరువాత జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా దంపతులు శ్రీశైలం ప్రాజెక్టు చేరుకుని మోడల్‌రూమ్‌ను సందర్శించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *