శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జునుడిని ఆదివారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యామూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా దంపతులు దర్శించుకున్నారు. శనివారం రాత్రి సీజే దంపతులు శ్రీశైలానికి వచ్చారు. ఆదివారం తెల్లవారుజామున స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారికి వేదపండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కలెక్టర్ కోటేశ్వరరావు, ఈవో లవన్న వారికి స్వామివారి శేష వస్త్రాలను, ప్రసాదాలను, స్వామిఅమ్మవార్ల జ్ఞాపికను అందజేశారు. తరువాత జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా దంపతులు శ్రీశైలం ప్రాజెక్టు చేరుకుని మోడల్రూమ్ను సందర్శించారు.
Tags srisilam
Check Also
ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ
-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …
Prajavartha Online Telugu News