గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ న్యాయవాది ఇది డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ మరో 200 సంవత్సరాల వరకు ఈ భారత దేశానికి ఎలాంటి డోకా లేని రాజ్యాంగానికి రూపకల్పన చేశారు. ఉన్నత చదువులు చదివిన దేశంలో కుల వర్ణ వివక్ష రూపుమాపడానికి శ్రీకారం చుట్టారంటూ… పిఎఫ్ గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం జరిగిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 131 జయంతి వేడుకల్లో పలువురు వక్తలు ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా రాజేశ్వరి రాజేష్ రీజినల్ పిఎఫ్ కమిషనర్ మరియు సహాయ కమిషనర్ కే సురేందర్ గారు మరియు జి ఆర్ జె ఆర్ మాధవ శంకర్, శ్రీనివాస్ వర్మ, శంకర రావు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మరియు టెలికాం గుంటూరు జిల్లా సలహా కమిటీ సభ్యులు నిమ్మరాజు చలపతిరావు తదితరులు ప్రసంగించారు.
Prajavartha Online Telugu News