తణుకు, నేటి పత్రిక ప్రజావార్త :
తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నిర్వహిస్తున్న ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొన్నారు. ఎడ్ల బలప్రదర్శనను మంత్రి రోజా ప్రారంభించారు. తణుకు జెడ్పీ బాయ్స్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్కే రోజా మంగళవారం నాడు మంత్రి కారుమురి వెంకట నాగేశ్వరావుతో పాల్గొన్నారు. మంత్రులు రోజా మరియు కారుమూరి నాగేశ్వరరావు మంగళవారం జరిగే ఎడ్ల బలప్రదర్శన పోటీలను ప్రారంభించారు. సంస్కృతి, సంప్రదాయాలు బావి తరాలకు తెలియచెప్పేలా ఈ ఎడ్ల బలప్రదర్శన పోటీలను మంత్రి కారుమూరీ వెంకట నాగేశ్వరరావు గారు నిర్వహించడం చాలా అభినందనీయం మని, ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా వుందని మంత్రి రోజా తెలిపారు.
Prajavartha Online Telugu News